Featured Posts
కూర పొడి
ఎండుమిరపకాయలు 10
ధనియాలు 100 gm
జీలకర్ర 2 tsp
పసుపు 1 sp
ఉప్పు తగినంత
పై వస్తువులని కొద్దిగా వేపి మిక్సీలో కాస్త బరకగా పొడి చేసుకుని
ఉంచుకోవాలి. ఏ కూరగాయలైనా (వంకాయ, దొండకాయ, బీరకాయ,
బెండకాయ,) ముక్కలుగా కోసి నూనెలో వేపి ఈ పొడి తగినంత చల్లి
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరి.
ఇడ్లీ పొడి
ఎండు మిర్చి 10
గుల్ల సెనగపప్పు 250 gm
ఎండుకొబ్బరి పొడి 50 gm
జీలకర్ర 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tsp
బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, పప్పు, జీలకర్ర విడివిడిగా వేపి
తీసి చల్లారిన తర్వాత ఉప్పు,కొబ్బరి తురుము కలిపి మిక్సీలో మెత్తగా
పొడి చేసుకోవాలి.
రసం పొడి
ధనియాలు 100 gm
పై వస్తువులన్ని కొద్దిగా వేపి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి
సాంబారు పొడి
బాణలిలో ఒకచెంచా నూనె వేడి చేసి అన్నింటిని విడివిడిగా బాగా రంగు
కొబ్బరి కారం
బాణలిలో నెయ్యి వేడి చేసి ఎండు కొబ్బరి ముక్కలు దోరగా వేయించి
ధనియాల పొడి
బాణలిలో నూనే వేడి చేసి ఎండుమిర్చి, పప్పులు, ఆవాలు, చింతపండు
కొత్తిమీర పొడి
కొత్తిమీర కట్టలు చివర కాడలు కట్ చేసి నీటిలో శుభ్రంగా చేసి పొడి
కారప్పొడి
పొదీనా పొడి
పుదీనా ఆకులను కడిగి శుభ్రపరచి నీడలో ఆరనిచ్చి తడి లేకుండా చూసుకోవాలి.
చింతచిగురు పొడి
చింత చిగురు 100 gm
ధనియాలు 100 gm
ఎండుమిర్చి 5
వెల్లుల్లి 5 రేకలు
నూనె 1/4 కప్పు
చింతచిగురుని నలిపి పుల్లలు లేకుండా శుభ్రపరచాలి. బాండీలో నూనే
వేడి చేసి విడివిడిగా ఎండుమిర్చి, ధనియాలు, కర్వేపాకు, వెల్లుల్లి చివరలో
చింతచిగురు కూడా వేసి వేగనిచ్చి తీసి చల్లారనివ్వాలి. మొత్తం మిక్సీలో
వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పులుపు సరిపోకుంటే కాస్త చింతపండు
రెక్కలు వేపి ఇందులో కలిపి పొడి చేసుకోవచ్చు.
గరం మసాలా
ధనియాలు కొద్దిగా వేపి అన్ని వస్తువులు కలిపి మెత్తగా పొడి చేసుకుని డబ్బాలో
ఉలవచారు
కరివేపాకు 2 tsp
ఉలవలు శుభ్రపరచి కనీసం రెండుగంటలు నానబెట్టాలి. లేకపోతే రాత్రి నానబెట్టి
మకరందంతో జీవితం మధురం
తేనె ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం.ఆరోగ్యప్రదాయినిగా, సౌందర్య సాధనంగా తేనెకి
మీ సందేహం
మిగిలిపోయిన అన్నంతో చాల రకాలు చేయొచ్చు.fast to cook, category లో చూడండి.
ఇంకా సెనపపిండిని హిందీలో బేసన్ అంటారు, ఇంకా ఇంగ్లీషులో chickpea flour అంటారు.
మటన్ ఫ్రై
ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి తరిగిన
రొయ్యల కూర
ముందుగా రొయ్యలు శుభ్రపరిచి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమిర,
టొమాటో గ్రుడ్డు కూర
మిరపకోడి కూర
పండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద,లవంగాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయల్ని
పొంగలి పులిహోర
ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి,ఓ పది నిమిషాలు నాననిచ్చి
కరివేపాకు పొడి
కరివేపాకు 1 కప్పు
ఎండుమిర్చి 4
జీలకర్ర 1 tsp
ధనియాలు 2 tsp
మినప్పప్పు 2 tsp
శనగపప్పు 2 tsp
వేరుశనగగుళ్ళు 4 tsp
తురిమిన పచ్చి కొబ్బరి 1/4 కప్పు
నెయ్యి 2 tsp
వెల్లుల్లి 5
చింతపండు 4 రెక్కలు
ఉప్పు తగినంత
నూనె 1 tsp
ముందుగా కరివేపాకును కడిగి ఆరబెట్టాలి. నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర,
ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశనగగుళ్ళు, పప్పులు, చింతపండు అన్ని దోరగా
వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకర లాడేలా
వేయించాలి. ఇవన్ని కలిపి తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత బాణలిలో
నెయ్యి వేడి చేసి ఈ పొడి, కొబ్బరి పొడి అన్ని కలిపి తడి ఆరిపోయి పొడి పొడిగా
అయ్యేదాకా వేయించి దింపేయాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి అన్నంలో
మొదటి నాలుగు ముద్దలు ఈ పొడి వేసుకు తింటే ఆకలి పెరుగుతుంది. చపాతీ
బ్రెడ్ మీద కూడా వేసి తినొచ్చు.
రాజ్మా కూర
ముందుగా రాజ్మా గింజలను కనీసం పది గంటలు నానబెట్టాలి. రాత్రి నానబెడితే
నిమ్మరసం పచ్చడి
నిమ్మరసం 250 ml
పచ్చళ్ళ కారం పొడి 25 gm
ఉప్పు 60 gm
పసుపు 1/2 tsp
జీలకర్ర పొడి 1 tsp
మెంతి పొడి 1/4 tsp
ఆవ పొడి 2 tsp
నూనె 50 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఎండుమిర్చి 3
ఇంగువ చిటికెడు
నిమ్మరసంలో ఉప్పు, కారంపొడి, పసుపు, జీలకర్రపొడి, మెంతి పొడి,
ఆవ పొడి అన్ని బాగా కలిపి ఉంచుకోవాలి. నూనె వేడి చేసి ఇంగువ,
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపి ఈ మిశ్రమాన్ని వేసి
కొద్దిసేపు ఉడికించి దింపి చల్లారాక వాడుకోవాలి. ఈ పచ్చడి మరుసటి
రోజు తింటే కారం ఘాటు తగ్గుతుంది.
అడగండిబాబు
అందరికీ నమస్కారం, నా బ్లాగును ఆదరిస్తున్నందుకు సంతోషం.మీకు కావల్సిన వంటకం గురించి ఇక్కడ చెప్పండి వీలైనంత త్వరగా ఆ వంటకాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తా.
చికెన్ రోస్ట్
చికెన్ 1 kg
ఉల్లిపాయలు 100 gm
అల్లం వెల్లుల్లి 2tsp
పసుపు 1tsp
ఎందుమిర్చి 8
గరం మసాలా 1 tsp
కొత్తిమిర 2 tsp
నూనె 50 gm
ముందుగా ఎండుమిరపకాయలు తొడిమలు తీసి అర కప్పుడు నీళ్ళలో నానబెట్టాలి
.అవి మెత్తబడిన తర్వాత మెత్తగా నూరి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి,పసుపు, కారం ముద్ద వేసి కొద్దిగా
వేపి చికెన్ ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చిన్న
మంటపై పూర్తిగా ఉడికేవరకు వేపి దింపేయాలి. నీరు పోయాల్సిన అవసరం ఉండదు.
మాంసం వేపుడు( మిరియాలపొడి )
మాంసం 250 gm
నూనె 50 gm
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1/2 tsp
ఉల్లిపాయలు 2
మిరియాలపొడి 2 tsp
ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలను ఎర్రగా వేయించాలి. ఇప్పుడు
అల్లం వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు, పసుపు, తగినంత
ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి అది బాగా వేగాక కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి.
ఇప్పుడు మిరియాల పొడి వేసి కలిపి ఎర్రగా వేయించి దింపేయాలి.
మాంసం వేపుడు
మాంసం 250 gm
ఉల్లిపాయలు 3
పచిమిర్చి 2
కారం పొడి 2tsp
ధనియాలపొడి 2 tsp
గరం మసాల 1 tsp
కొబ్బ్బరి పొడి 2 tsp
గసగసాలు 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
నూనె 50 gm
పసుపు 1/2 tsp
ఉప్పు తగినంత
కొబ్బరి, గసగసాలు కలిపి, ముద్దగా నూరి పెట్టుకోవాలి.ఉల్లిపాయలు సన్నగా
తరిగాలి. మాంసం ముక్కలను కడిగి ఉప్పు,కారం, పసుపు, అల్లం వెల్లుల్లి అన్నీ
కలిపి ముక్కలకు పట్టించి రెండు గ్లాసుల నీళ్ళు పోసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి
కొబ్బరి ముద్ద గరం మసాల పొడి వేసి కలిపి మళ్ళీ దగ్గర పడేవరకు ఉడికించాలి.
ఒక వెడల్పాటి బాణలిలో నూనే వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపి
ఈ ముక్కలు మసాలాతో పాటు వేసి బాగా వేగిన తర్వాత కొత్తిమిర చల్లి దింపేయాలి.
చిట్కాలు
1. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే చారెడు ఉప్పు వేసి 10 నిమిషాలు
నాననిస్తే మట్టిగడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి.
2. కూరలు తరిగేటప్పుడు కత్తిపీట క్రింద పాత పేపరు వేసుకుంటే, తరిగిన తొక్కలను
అలాగే పేపరుతో ఎత్తి బైట పారేయవచ్చు. లేకపోతే అనంతరం ఊడ్చుకోవడం
శ్రమ, టైం వేస్టూనూ.
3. కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి, ఆ తరువాతనే తరగాలి.
అంతేగాని ముందుగా తరిగేసి,తరువాత కడగకూడదు.
4. ముందుగా కడిగినా కూడా అరటికాయ మొదలైనవాటిని తరిగి నీళ్ళలోనే
వేయాలి. ఇటువంటి కూరలు రెండుసార్లు శుభ్రపడవలసిందే.
5. కూరగాయముక్కల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే ఏవైనా క్రిములు ఉంటే
అవి పైకి తేలిపోతాయి.
6. కూరలను మరీ సన్నగాను నాజూకుగానూ తరగకూడదు. అందువల్ల వాటిలోని
పోషకాంశాలు నశించే ప్రమాదముంది.
7. కొన్ని కూరలు తరిగేటప్పుడు చేతులు బంకగానో, పొరలు గానో వచ్చేస్తూనో
ఉంటాయి అరటి పనస వంటి కూరలు.తరిగేముందు చేతులకు కొంచెం నూనె
రాసుకుని తరిగితే ఆ విధంగా జరగదు.
8. కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చేతుల్ని చింతపండు రసంలో
తడుపుకుంటే దురదలు పుట్టవు.
9. తరిగిన కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు వేసి నలిపితే చేదు తగ్గుతుంది.
10. బంగాళాదుంపలు మెత్తబడినట్లయితే తరగబోయేముందు వాటిని ఒక అర
గంట ఐస్ వాటర్లో ఉంచితే గట్టిపడతాయి.
12. వంకాయలు, అరటికాయలు తరిగేటప్పుడు కొంచెం పెరుగు కలిపిన నీళ్ళలోకి
తరిగితే కనరెక్కకుండా ఉంటాయి.
13. వంకాయ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళలోకాని, ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తే
కనరెక్కకుండాను, నల్లబడకుండానూ ఉంటాయి.
14. అరటిపువ్వును దంపేటప్పుడు పసుపు వేసి దంపితే నల్లబడదు.
15. ఉల్లిపాయలను ఒక అరగంట సేపు నీళ్ళలో నాననిచ్చి, ఆ తర్వాత తరిగితే
కళ్ళమ్మట నీళ్ళు రావు.లేదా ఫ్రిజ్లో పెట్టి తీసినా సరే.
16. కాలిఫ్లవర్ ను ఎప్పుడుగానీ చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన గోరువెచ్చటి
నీళ్ళలో వేసి కొద్ది సేపు తర్వాత తీసి వండుకోవాలి. ఇలా చేస్తే అందులోని
క్రిములు చచ్చిపోతాయి.
17. ఉల్లిపాయ తరిగేటప్పుడు రెండువైపులా కోసి మధ్యకి తరిగితే పైనున్న పొర
త్వరగా వచ్చేస్తుంది.
18. వెల్లుల్లికి కొద్దిగా నూనె రాసి కొద్దిసేపు ఎండలో బెడితే పొట్టు తేలిగ్గా వస్తుంది.
19. నిమ్మకాయను నేలమీద పెట్టి అరచేత్తో అదిమి కాస్త మెత్తబడ్డాక కోస్తే రసం
పిండటం తేలికగా ఉంటుంది ఎక్కువ వస్తుంది కూడా.
20. పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితె లోపలి ద్రవం
బైటకు రాకుండా బాగా ఉడుకుతుంది.
21. గ్రుడ్లను ఉడకబెట్టిన తర్వాత వెంటనే చన్నీళ్ళలో ఉంచితే పైపెంకు
ఒలవడం తేలికవుతుంది.
22. ఉడికిన గ్రుడ్లను చన్నీళ్ళలో ముంచిన కత్తితో కోస్తే బాగా తెగుతాయి.
23. కోడిగ్రుడ్లను అల్యూమినియం, లేదా వెండిపాత్రలలో పగలగొడితే
అందులోని సల్ఫర్ కారణంగా పాత్రలు నల్లబడతాయి.
24. తడిగా ఉన్న పాత్రలలోకి పగలగొడితే గ్రుడ్డులోని పసుపు భాగం పాత్రకు
అంటుకోకుండా ఉంటుంది.
25. ఆమ్లెట్లు వేసేముందు గిన్నెలో ఉప్పు కారం మసాలా అన్నీకలిపి కొద్దిగ
నీరుపోసి కలిపిన తర్వాత గ్రుడ్లను కొట్టి కలిపితే అవి సమానంగా కలుస్తాయి.
అందం-చందం పుదీనా

వంటకాల్లో రుచికోసం, వాసన కోసం సాధారణంగా పుదీనాను ఉపయోగిస్తుంటాం.
కానీ వాస్తవంగా పుదీనాలో ఆరోగ్యాన్ని కలిగించే ఔషధాలే కాకుండా సౌందర్య
పోషణకు కావాల్సిన లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
* నోరు దుర్వాసన వేస్తుంటే ప్రతిరోజూ నాలుగైదు పుదీనా ఆకులను నములుతుండాలి.
* పుదీనా ఆకులను నీళ్ళలో మరిగించి పుక్కిలిస్తే చిగుళ్ళ వాపు తగ్గి రక్తం
* పరగడుపున కొన్ని పుదీనా ఆకులను నమిలి తింటే కడుపులో ఉండే నులి
* గొంతు బొంగురుపోతే పుదీనా డికాక్షన్లో ఉప్పు కలుపుకుని పుక్కిలిస్తే గొంతు తిరిగి
* పుదీనా తినడంవల్ల ఒంట్లో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది.
* ఆహార పదార్థాలపై క్రిములు వాలకుండా పరిశుభ్రమైన వస్త్రాన్ని కప్పి దానిపై
* పెరట్లో పుదీనా పెంచడంవల్ల మిగతా చెట్లకు చీడ పట్టకుండా ఉంటుంది.
* పుదీనా ఆకును మరిగించిన నీటితో ముఖాన్ని రోజూ కడుగుతుంటే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది.
* తరచుగా పుదీనా రసాన్ని పెదవులకు రాసుకుంటే అవి మృదువుగా ఎర్రగా మరుతాయి.
* కాళ్ళ పగుళ్ళకు పుదీనా డికాషన్ రాస్తే త్వరగా నయమవుతాయి. * పుదీనా అకుల రసాన్ని ముఖానికి రుద్దుకుంటే మొటిమలు, మచ్చలు ఇట్టే మాయమవుతాయి.
గుమ్మడికాయ సెనగపప్పు కూర
ముందుగా గుమ్మడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి.
ముద్దపప్పు
పచ్చిమిర్చి 3
ముందుగా పప్పు కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్ళు పోసి, పసుపు, కొద్దిగా
పాలకూర పప్పు
ముందుగా కందిపప్పు, సెనగపప్పు, కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్ళు పోసి పసుపు,




































