Featured Posts
ఘాటైన మాంసం కూర
మాంసం 250 gm
ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి అరకప్పు నీటిలో నానపెట్టాలి. తర్వాత
మాంసం పులుసు కూర
ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి,
కోఫ్తా కూర
ఖైమా 250 gm
ఉల్లిపాయలు 2
టోమాటోలు 3
కొబ్బరి పొడి 3 tbsp
గరం మసాలా 1 tsp
ధనియాల పొడి 2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
నూనె 4 tbsp
శుభ్రపరచిన ఖైమాలో నీళ్ళు పిండేసి సగం పసుపు,కారం,అల్లం వెల్లుల్లి,గరం
మసాలా, కొబ్బరి పొడి,ఉప్పు, కొత్తిమిర వేసి గ్రైండర్లోకాని రోట్లో కాని రుబ్బుకొని
(మరీ మెత్తగా ఉండకూడదు.అన్ని బాగా కలిసేటట్టు ఉంటే చాలు) చేతికి కొద్దిగా
నూనె రాసుకుని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో
నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి మిగిలిన పసుపు,
కారం,అల్లం వెల్లుల్లి, ధనియాల పొడివేసి కొద్దిగా వేపి ఖైమా ఉండలు వేసి
మెల్లిగా విడిపోకుండా వేయించాలి. నీరంతా ఇగిరిపోయాక టోమాటోలు,
తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఉండలు ఉడికాక కొత్తిమిర,గరం
మసాలా కలిపి దింపేయాలి.
ఖైమా బఠానీ కూర
ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి, పసుపు, అల్లం
ఖైమా బంగాళదుంప
ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పసుపు, అల్లం
గోంగూర మాంసం
మాంసం 250 gm
ముందుగా గోంగూర శుభ్రపరచి రెండు నిమిషాలు ఉడికించి తీసి పక్కన పెట్టాలి.
హైదరాబాదీ ఫిర్నీ
బాస్మతి బియ్యం 5 tbsp
ముందుగా బియ్యం కడిగి బరకగా పొడి చేసికోవాలి. ఈ తడి బియ్యం పిండిని
పెసరపప్పు పాయసం
పెసరపప్పు 100 gm
ముందుగా పెసరపప్పును మెత్తగా ఉడికించి పచ్చికొబ్బరి, పంచదార వేసి
బియ్యంతో పాయసం
బియ్యం 1 కప్పు
ముందుగా బియ్యం కడిగి అరగంట నానబెట్టి మెత్తగా ఉడికించాలి. తర్వాత
సేమ్యా పాయసం
సేమ్యా 100 gm
ముందుగా సేమ్యాను నెయ్యిలో దోరగా వేయించాలి.పాలు నీళ్ళు కలిపి
రవ్వ పాయసం
రవ్వ 1 కప్పు
చక్కెర 1 1/2 కప్పు
నీరు 2 కప్పులు
పాలు 3 కప్పులు
యాలకుల పొడి 1 tsp
నెయ్యి 2 tsp
కిస్మిస్ 10
జీడిపప్పు 10
ముందుగా నెయ్యి వేడి చేసి రవ్వను దోరగా వేయించాలి. వేరే గిన్నెలో నీళ్ళు
మరగబెట్టి అందులో రవ్వ మెల్లిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ
ఉండాలి.ఇప్పుడు పాలు పోసి కలుపుతూ ఉండాలి. తరువాత చక్కెర వేసి
కరిగేవరకు కలుపుతూ ఉండాలి.యాలకుల పొడి, నేతిలో వేయించిన కిస్మిస్,
జీడిపప్పు కలిపి దింపేయాలి. చివరలో ఇంకో రెండు చెంచాల నెయ్యి వేస్తే
రుచిగా ఉంటుంది.
బెండకాయ టొమాటో కూర
బెండకాయలు 250 gm
బెండకాయలను అరంగుళం ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వెడల్పాటి
బెండకాయ వేరైటీ వేపుడు
బెండకాయలను నిలువుగా చీల్చి అందులో తగినంత ఉప్పు కలిపిన
మసాలా బెండకాయ వేపుడు
నూనె, బెండకాయలు తప్ప మిగతావన్ని కలిపి పెట్టుకోవాలి.
బెండకాయ క్రంచీస్
బెండకాయలను సన్నని చక్రాలుగా కోసి వేడి నూనెలో ఎర్రగా
బెండకాయ పులుసు
బెండకాయలు 1/4 kg
బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.నూనె వేడి చేసి
బెండకాయ వేపుడు
బెండకాయలు 1/2 kg
బెండకాయలను సన్న ముక్కలుగా కోసుకోవాలి. వెడల్పాటి నాన్స్టిక్
నాటుకోడి ఇగురు
ముందుగా నాటుకోడిని మంటపై కొద్దిగా కాల్చి పసుపు రాసి కడిగి
రాగి ముద్ద
ముందుగా కడిగిన బియ్యం,ఉప్పు,నెయ్యి,నీళ్ళు కలిపి ఉడికించాలి.
శుభప్రదాయిని తులసి

భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధన అనాదికాలం నుంచి వున్నదే.
వైజ్ఞానికంగా చూసినా ఈ ఆరాధన సముచితమైనదే. హిమాలయాలు,
చిత్రకూటం, వింధ్య పర్వతాలు, నల్లమల అడవులు, నీలగిరులు
మొదలైన అనేక ప్రదేశాలలో మహత్తరమైన వనమూలికలు ఎన్నో
లభిస్తున్నాయి. భరతఖండంలోని అనేక సంప్రదాయక కుటుంబాలలో
తులసిని పవిత్ర భావంతో ఆరాధిస్తుంటారు కారణం ఏమిటీ? అని
ప్రశ్నించుకుంటే 'తులసిని అర్చించే ఇంటిలో రోగాణువులు ప్రవేశించ
లేవు. యమ కింకరులు ఆ ఇంటి వైపు దృష్టిసారించలేరు ' అని
పురాణాలలో చెప్పడం గోచరిస్తుంది.ఇక్కడ యమకింకరులు అంటే
పాములు, తేళ్ళు, జెర్రులు మొదలైన ప్రాణాంతక విషకీటకాలు అని
చెప్పుకోవాలి. తులసి చెట్టు దాపులోకి విషజంతువులు ప్రవేశించలేవు
ఎందుకంటే తులసి ఘాటుకు విషకీటకాలు వికర్షితమవుతాయి.
తులసికి కాలుష్యాన్ని హరించి వాతావరణాన్ని శుభ్రం చేసే గుణముంది.
భారతదేశంలో ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ తులసి ఆరాధన
వుంటుంది.మన ధార్మిక, పౌరాణిక గ్రంధాలలో తులసి విశిష్టతలను
ప్రత్యేకంగా వివరించారు.సైన్సు రిత్యా తులసిలో రోగనిరోధక శక్తి
అధికం. తులసిదళంలో ఆక్సిజన్ ఎక్కువ పాళ్ళలో వుంటుంది.
ఆయుర్వేదపితామహుడైన చరకుడు ఎక్కిళ్ళు, దగ్గు, ఉబ్బసం,
ఊపిరితిత్తుల వ్యాధులువిషానికి విరుగుడు మొదలైన వాటికి
విరుగుడుగా చరకసంహితలో రాశాడు. తులసిలో ఎన్నో
రకాలున్నాయి. వాటిలో కృష్ణ తులసి, లక్ష్మి తులసి, విష్ణు తులసి
ముఖ్యమైనవి. ఏ రకమైన తులసిలో అయినా ఔషధగుణాలున్టాయి.
తులసివనం క్షయ అంటే టిబీ వ్యాధిపీడితులకు శానిటోరియం
వంటిదిగా చెప్పవచ్చు. దీని నుండి వెలువడే గాలి పీలిస్తే ఊపిరి
తిత్తులు పరిశుభ్రపడతాయి. మరణశయ్యపై వున్నవారికి తులసి
తీర్థం ఇవ్వడం సంప్రదాయం. ప్రాచీనకాలంలో గృహనిర్మాణ
సమయంలో తులసి మొక్క క్రింద ఉండే మన్నును పసుపు బట్టలో
చుట్టి ఒక పాత్రలో వుంచి దానిని ఇంటి పునాదిలో పెట్టే ఆచారం
వుండేది. అలా చేస్తే పిడుగుల బారి నుంచి ఇంటికి రక్షణ
కలుగుతుందని నమ్మిక
మలేరియా వ్యాధికి తులసి దివ్యౌషధంగా చెబుతారు. తులసిని
తీసుకోవడం వల్ల స్థూల కాయం తగ్గుతుంది. రక్తపోటు అదుపులో
వుంటుంది. ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు, కాలిన గాయాలు
షేవింగ్ సమయంలో పడే గాట్లను రూపు మాపే శక్తి వుండడం వల్ల
తులసిని సౌందర్యప్రదాయినిగా కూడా పేరుకొంటారు. తులసి ఆకులను
నూరి మెత్తటి గుజ్జులాగా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేసుకుంటే
ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఇన్ని విశిష్టతలున్నాయి గనుకనే
తులసిని పూజించడంలో అనౌచిత్యమేమీ లేదని చెప్పవచ్చు. వైద్య
శాస్త్రం కూడా తులసిలో ఔషధగుణాలున్నాయన్న విషయం
అంగీకరించింది. కాబట్టి దానిలోని మంచిని గ్రహించడం అందరికీ
మంచిదే.
వంకాయ మెంతికూరతో
వంకాయలు 250 gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 5
మెంతికూర అరకప్పు
టొమాటోలు 3
అల్లంవెల్లుల్లి 1 tsp
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
కరివేపాకు 1 tsp
పసుపు 1/2 tsp
నూనె 3 tbsp
ముందుగా వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి
ఉంచుకోవాలి.పచ్చిమిర్చి,మెంతికూర సన్నగా తరిగి పెట్టుకోవాలి.
నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను మెత్తబడేవరకు
వేయించి పచ్చిమిర్చి,మెంతికూర,పసుపు,అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.వంకాయముక్కలు,తగినంత ఉప్పు వేసి బాగా
కలియబెట్టి మూత పెట్టాలి. చిన్న మంటపై నిదానంగా
ఉడకనివ్వాలి.
వంకాయ అల్లంతో
వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 2
అల్లం 2"ముక్క
పచ్చిమిర్చి 6
పసుపు 1/2 tsp
కొత్తిమిర పావు కప్పు
నూనె 3 tbsp
ఆవాలు 1/2 tsp
ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో
వేసి ఉంచాలి. అల్లం,కొత్తిమిర,పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరి
పెట్టుకోవాలి.నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడాక తరిగిన
ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించి నూరిన అల్లం ముద్ద,
పసుపు వేసి మళ్ళీ కొద్దిగా వేపాలి.ఇప్పుడు వంకాయ ముక్కలు,
తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. చిన్నమంటపై
నిదానంగా నూనెలోనే మగ్గనివ్వాలి. ఈ కూర మంచి సువాసనతో
రుచిగా ఉంటుంది.
నువ్వు వంకాయ
వంకాయలు 250 gm
శెనగపప్పు 3 tbsp
నువ్వులు 2 tbsp
ఎండుమిర్చి 5
జీలకర్ర 1 tsp
మెంతులు 1/4 tsp
ధనియాలు 3 tsp
పసుపు 1/4 tsp
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp
వంకాయలు, నూనె, తప్ప మిగతా వస్తువులు అన్ని కొద్దిగా వేపి,
బరకగా పొడి చేసుకోవాలి.వంకాయలు నాలుగు పక్షాలుగా కోసి
ఉప్పునీళ్ళలో వేసి ఉంచుకోవాలి. వంకాయలలో కొద్దిగా మసాలా
పొడిని కూరి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి ఈ కూరిన వంకాయలను
వేసి మూత పెట్టాలి.నిదానంగా చిన్న మంటలో మగ్గనివ్వాలి.అవి
సగం మగ్గిన తర్వాత మిగతా పొడి కూడా కలిపి మళ్ళి మూత పెట్టి
నూనెలోనే ఉడకనివ్వాలి.చివరలో కొత్తిమిర చల్లి దింపేయాలి.
వంకాయ పెరుగుతో కూర
వంకాయలు 250 gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్హ్చి 2
అల్లం 1/2" ముక్క
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
గరం మసాలా 1 tsp
కరివేపాకు 1 tsp
పెరుగు 1 కప్పు
కొత్తిమిర 2 tsp
నూనె 3 tbsp
ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉప్పు వేసిన
నీళ్ళలో వేసి ఉంచాలి. నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి
ఎర్రగా వేయించి పచ్చిమిర్చి,తరిగిన అల్లం,కరివేపాకు,పసుపు,
కారం వేసి కొద్దిగా వేపి వంకాయముక్కలు తగినంత ఉప్పు వేసి
కలియబెట్టి మూత పెట్టాలి.నిదానంగా ఉడకనివ్వాలి.చివరగా
చిలికిన పెరుగు కలిపి కొత్తిమిర, గరం మసాలాపొడి వేసి కలిపి
దింపేయాలి.ఇది చపాతీలలోకి బావుంటుంది.
గుత్తివంకాయ కూర
గుండ్రటి వంకాయలు 250 gm
ముందుగా చిన్న గుండ్రటి వంకాయలను తీసుకుని నాలుగు పక్షాలుగా
వంకాయ కొబ్బరి వేపుడు
వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 2
తురిమిన పచ్చి కొబ్బరి 3 tbsp
పసుపు 1/4 tsp
కారం 1/2 tsp
అల్లం వెల్లుల్లి 1/2 tsp
జీలకర్ర 1/4 tsp
ఆవాలు 1/4 tsp
కరివేపాకు 1 tsp
నూనె 3 tbsp
ముందుగా వంకాయలను నిలువుగా సన్నటి ముక్కలుగా కోసి
ఉప్పు వేసిన నీళ్ళలో వేసి ఉంచాలి. నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఎర్రబడేవరకు వేయించి పసుపు, కారం,
కరివేపాకు,అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించాలి. ఇప్పుడు
వంకాయ ముక్కలు,తగినంత ఉప్పు,కొబ్బరి వేసి బాగా కలియబెట్టి
మూత పెట్టాలి. ఇది నిదానంగా ఉడకనివ్వాలి.దింపేముందు
కొత్తిమిర చల్లుకోవచ్చు.
వంకాయ కందిపప్పు కూర
వంకాయలు 250 gm
కందిపప్పు 50 gm
ఎండుమిరపకాయలు 5
జీలకర్ర 1 tsp
ధనియాలు 2 tsp
ఉల్లిపాయ 1
అల్లం వెల్లుల్లి 1 tsp
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ముందుగా కందిపప్పును కొద్దిగా వేపి కుక్కర్లో మరీ మెత్తబడకుండా
ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి పెట్టుకోవాలి. ఎందుమిరపకాయలు,
జీలకర్ర,ధనియాలు కొద్దిగా వేపి పొడి చేసుకోవాలి.వెడల్పాటి బాణలిలో
నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించి
కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి,పసుపు,అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా
వేయించాలి. ఇప్పుడు తరిగిన వంకాయ ముక్కలు వేసి బాగా
కలియబెట్టి మూతపెట్టాలి.కొద్దిగా మగ్గిన తర్వాత మసాలాపొడి,
కందిపప్పు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.చివరగా
కొత్తిమిర కాని తురిమిన కొబ్బరి కాని వేసుకోవచ్చు. ఇది
చపాతీలోకి బావుంటుంది.
బంగాళదుంప బటానీ కూర
ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి
బంగాళదుంప పుట్టు
ముందుగా బంగాళదుంపలను పావు స్పూను పసుపు,తగినంత
బంగాళదుంప ఖుర్మా
ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు
బంగాళదుంప కూర
బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు
బంగాళదుంప కాలిఫ్లవర్ కూర
అరటిదూట-పప్పు కూర
అరటిదూట జానెడు ముక్క
పెసరపప్పు 100 gm
ఉల్లిపాయ 1
అల్లం చిన్న ముక్క
పచ్చిమిర్చి 8
నూనె 2 tbsp
పోపు గింజలు 2 tsp
కరివేపాకు 2 రెబ్బలు
ఉప్పు తగినంత
ముందుగా చెప్పిన విధంగా అరటిదూటను శుభ్రం చేసి ముక్కలు
కోసుకోవాలి. ముక్కలలో కొంచెం ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేవరకు
ఉడికించి వార్చుకోవాలి. పెసరపప్పు అరగంటపాటు నానబెట్టి,
నీరు ఓడ్చాలి.ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం సన్నగా ముక్కలు
కోసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పోపు గింజలు
వేసి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కరివేపాకు
వేసి కొంచెం వేగాక అరటిదూట ముక్కలు, పెసరపప్పు, తగినంత
ఉప్పు వేసి కలిపి ఎర్రగా వేయించుకోవాలి.
ఆవ పెట్టిన అరటిదూట కూర
అరటిదూట జానెడు ముక్క
సెనగపప్పు 1 tsp
మినపప్పు 1 tsp
కారం 1/2 tsp
ఆవాలు 1/4 tsp
ఎండుమిర్చి 2
జీలకర్ర 1/2 tsp
చింతపండు చిన్న నిమ్మకాయంత
కరివేపాకు 3 రెబ్బలు
ఆవ పొడి 1 tsp
నూనె 50 gm
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
అరటిదూట ముందు పైపెచ్చు తీసి చిన్న చిన్న చక్రాలుగా కోసి పీచు
వేలుకు చుట్టుకుంటూ లాగితే పీచు వస్తుంది. అప్పుడు చిన్న చిన్న
ముక్కలుగా కోసుకోవాలి. కొంచెం నీళ్ళలో ఉప్పు వేసి ముక్కలు వేసి
ఉడికించుకోవాలి. దించేటప్పుడు పసుపు వేసి కలిపి దించి వార్చాలి.
బాణలిలో నూనె పోసి, కాగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు వేయించి,
సెనగపప్పు, మినపప్పు, అవాలు వేసి అవి వేగాక, కరివేపాకు,
అరటిదూట ముక్కలు వేసి రెండునిమిషాలు వేయించి, చిక్కటి
చింతపండు పులుసు పోసి 5 నిమిషాలు వేయించి దింపేయాలి. ఒక
స్పూను ఆవ పొడిని ఒక స్పూను నూనెతో కలిపి కూరలో కలుపుకోవాలి.
అరటిపువ్వు- కొబ్బరి కూర
అరటిపువ్వు ముందు చెప్పిన విధంగా శుభ్రం చేసి ఉడికించి
అరటిపువ్వు పెసరపప్పు కూర

అరటిపువ్వు 1
పెసరప్ప్పు 1 కప్పు
ఉల్లిపాయలు 2
అల్లం ముక్క చిన్నది
పచ్చిమిర్చి 6
నూనె 100 gm
ఉప్పు తగినంత
పసుపు 1/4 tsp
పోపుగింజలు 2 tsp
కరివేపాకు 2 రెబ్బలు
పెసరపప్పు నానబెట్టుకోవాలి. అరటిపువ్వు దొప్పలు తీస్తే చిన్న చిన్న
కాయలు వుంటాయి. వీటిని విడదీస్తే అందులో పుల్లలు లాంటివి చిన్న
చిన్న డొప్పలు ఉంటాయి. పుల్లలు ఏరి పారేయాలి. పుల్లలు విడ
దీయటానికి రావు. దానికి తలలు తీసేస్తే చాలు. అన్నీ వేరు చేసి ఈ
కాయలు కచ్చా పచ్చాగా దంచి కొంచెం నీరు పోసి కడిగి మరల కొంచెం
నీరు పోసి పొయ్యి మీద పెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేసి
కలిపి, దించి నీరు వార్చాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత
పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం పచ్చిమిర్చి ముక్కలు
వేసి బాగా వేయించి, వార్చిన అరటిపువ్వు వేసి పైన పెసరపప్పు
వేసి తగినంత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి వేయించి దింపేయాలి.
అరటికాయ ముద్ద కూర
అరటికాయలు చెక్కు తీసి ముక్కలుగా తరిగి ఒక పొంగు వచ్చేవరకు
అరటికాయ -ఉల్లికారం
అరటికాయలు పెచ్చు తీసి చక్రాలుగా తరిగి మజ్జిగలో వేసి, బాణలిలో
అరటికాయ పెసరపప్పు కూర
అరటికాయలు 3
పెసరపప్పు 100 gm
పోపు గింజలు 2 tsp
ఎండుమిర్చి 2
కరివేపాకు 2 రెబ్బలు
పసుపు 1/4 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
నూనె 50 gm
అరకాయలు పెచ్చు తీసి మజ్జిగలో చక్రాలుగా కాని ముక్కలుగా కాని
తరిగి వేయాలి. పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టాలి.బాణలిలో నూనె
వేడి చేసి పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడాక
అరటి ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు వేసి కలపాలి.కొంచెం వేగిన
తర్వాత పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి కలిపి మూత బెట్టి
ఉడకనివ్వాలి. ముక్కలు, పప్పు ఉడికిన తర్వాత కొత్తిమిర చల్లి
దింపేయాలి.
అరటికాయ వేపుడు
అరటికాయలు 3
మజ్జిగ 2 కప్పులు
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
కారం 1 tsp
నూనె 2 tbsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 1 కట్ట
అరటికాయ పై పెచ్చు తీసి, చక్రాలుగా కాని,చిన్న ముక్కలుగా కాని
తరిగి మజ్జిగలో వేయాలి, లేకుంటే నల్లబడతాయి. బాణలిలో నూనె వేసి
కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర,కరివేపాకు వేసి అవి చిటపటలాడాకా
అరటిముక్కలు వేసి పసుపు,కారం,ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
మధ్య మధ్యలో కదుపుతూ ఎర్రగా వేగిన తర్వాత దింపాలి.









































