Featured Posts
క్యారట్ తో
క్యారట్ ను సన్నగా తురిమి పెట్టుకోవాలి. కొద్దిగా సెనగపప్పు లేదా పెసరపప్పు నానబెట్టి
ఉంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి ఆవాలు,జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసి
వేగిన తర్వాత సెనపప్పు రెండు పచ్హిమిర్చి, కరివేపాకు ,పసుపు వేయాలి.ఇప్పుడు
తురిమిన క్యారట్ వేసి తగినంత ఉప్పు,కారం వేసి కలిపి మూత పెట్టాలి.ఒ పది
నిమిషాలు చిన్న మంటపై నిదానంగ ఉడకనివ్వాలి.కొత్తిమిర,కొద్దిగా గరం
మసాలా పొడి వేసి కలిపి దించేయండి.చపాతీలలోకి సూపర్ గా ఉంటుంది..
క్యాబేజీతో
ముందుగా క్యాబేజీని సన్నగ దారాల్లాగ తరిగిపెట్టుకోవాలి.పొయ్యిపై గిన్నె పెట్టి కొద్దిగా
ఎక్కువె నూనె వేసి కాగిన తర్వాత కారానికి కావల్సినంత ఎండు మిర్చి,ఆవాలు,
జీలకర్ర,మినప్పప్పు కొద్దిగ ఎక్కువ సెనగపప్పు వేసి వేగిన తర్వాత కరివేపాకు
పసుపు వేయాలి. ఇప్పుడు క్యాబేజీ వేసి తగినంత ఉప్పు వేసి బాగాకలిపి మూత పెట్టాలి
నిమిషాలు చిన్న మంటపై అదే నూనెలో మగ్గనివ్వండి. పది నిముషాల తర్వాత కొత్తిమిర
చల్లి దించేయండి.ఇది చపాతీలలోకి అన్నంలోకి కూడా బావుంటుంది.
దోశలు
తీపి
మైదా కాని గోధుమ పిండి కాని తీసుకుని అందులో తగినంత చక్కెర,ఏలకుల పొడి
లేదా వెనిల్లా ఎస్సెన్స్ వేసి బాగ కలిపి పెట్టండి..ఓ పది నిమిషాల తర్వాత నాన్ స్టిక్
పెనంపై నెయ్యి లేదా వెన్నతో దోశలేసుకోడమే. అలాగే తినొచ్చు లేదా జాం తో
కారం
సెనగపిండి లో ఉప్పు,కారం,పసుపు,సన్నగ తరిగిన కరివేపాకు,కొత్తిమిర,కొద్దిగా గరం
మసాల పొడి వేసి కలిపి పెట్టాలి. పది నిమిషాల తర్వాత పెనంపై దోశలు వేసుకోడమె.
ఇలాగే తినొచ్చు లేదా ఆవకాయ ఐతె అదురుద్ది.
పప్పు
టొమాటో పప్పు ఎలా చెయాలో తెలిసిందిగా. ఇంకో విధానం ఏంటంటే కుక్కర్ లో అన్ని
కలిపి నీళ్ళు పోసి ఓ ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దించేయాలి. పోపు పెట్టుకుంటె సరి..
కూరగాయలతో పప్పు ఎలా చేయాలో చూద్దామా
కుక్కర్లో కందిపప్పు,పసుపు నూనె వేసి ఒక విజిల్ రాగానె దించేయాలి. ఇప్పుడు తరిగిన
ఉల్లిపాయ, పచ్చిమిర్చి,కరివేపాకు,కొత్తిమిర మనం కావల్సిన ఎదైనా కూరగాయ-
పాలకూర, చుక్కకూర, తోటకూర, బచ్చలికూర, దోసకాయ,చామదుంప,బీరకాయ,
ఇలా ఏదైన ఓ కూరగాయ, ఉప్పు, కారం పొడి,అల్లం వెల్లుల్లి ముద్ద కొంచం
(లేకున్నా ఎంకాదు) వేసి కలిపి మళ్ళి ఓ మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి
దించేయాలి..చల్లారిన తర్వాత పోపు పెట్టేయడమె.
టొమాటో పప్పు
ముందుగా కంధిపప్పును పసుపు అరస్పూను నూనె వేసి కుక్కర్లో ఒక విజిల్
వచ్చేవరకు ఉంచండి.చిన్న ఉల్లిపాయ నాలుగు టొమాటోలు తరిగి పెట్టుకొండి.
ఇప్పుడు పప్పు లొ ఉల్లిపాయలు,టొమాటోలు,రెండు పచ్చిమిర్చి,కొత్తిమిర,
కరివేపాకు,ఉప్పు, కారంపొడి, అల్లం వెల్లులి ముద్ద ఓ స్పూను,చింతపండు
చిన్న ముక్కలు చేసి అన్ని కలిపి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేయాలి. రెండు
విజిల్స్ రాగానె దించి చల్లారాక నూనె కొద్దిగా నెయ్యి వేసి వెడి అయ్యాక ఆవాలు
,జీలకర్ర,కరివేపాకు,నాలుగు వెల్లుల్లి వేసి పోపు పెట్టండి.
ఆంధ్రులు పోపు పెడితే పొలిమేర దాకా అదిరిపోవాలంట మరి.
ఏ కూరైనా చాలా సులువుగా చేసుకోవచ్చు
ముందుగా ఉల్లిపాయ సన్నగా తరిగిపెట్టుకోవాలి.మనకు కావల్సిన లేక మన దగ్గర
ఉన్న కూరగాయలు తరిగి పెట్టుకోవాలి.పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగిన
తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి చిటపటలాడాక ఉల్లిపాయలు
వేయాలి.మంట మాత్రం తక్కువగా ఉండాలి.నిదానంగా చిన్న మంటపై తక్కువ
నీటితో చెస్తే కూర ఏదైన చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు
,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కాస్త వేపాలి. ఇపుడు మన దగ్గరున్న కూరగాయ
ముక్కలను వేసి కారం పొడి,తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి.అది ఆ
నూనె లోనే మగ్గిపోతుంది.అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు పోయాలి.
కూర మొత్తం ఉడికి నూనె తేలాక కొత్తిమిర, కొద్దిగా గరం మసాల పొడి వేసి
దించేయడమే.
ఇంట్లో ఏ కూరగాయలు లేకుంటే
ఓ కప్పుడు సెనగపప్పు అరగంట నానపెట్టండి. ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి.పొయ్యి
మీద గిన్నె పెట్టి కాస్త ఎక్కువ నూనె వేసి(పప్పు కాబట్టి) కాగిన తర్వాత ఉల్లిపాయలు
వేసి గొధుమవర్ణం వచ్చేవరకు వేయించి పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి,
కరివేపాకు వేసి కొద్దిగా వేపి నానపెట్టిన సెనగపప్పును నీళ్ళు తీసేసి వేయాలి.తగినంత
ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాఅలి.తడి ఆరిపోయాక కొద్దిగా నీళ్ళు పోసి మూత
పెట్టెయండి..ఓ పదినిమిషాల తరవాత కూర ఉడికిపోతుంది.కుక్కర్లో ఐతె 5 నిమిషాలు
చాలు.కొత్తిమిర, గరం మసాల పొడి వేసి దించేయండి.ఈ కూర పొడిపొడిగానే ఉండాలి.
ముద్దలా కాకుండా కస్త జాగ్రత్త పడితే చాలు.
దీనికి బెస్ట్ కాంబినేషన్ పచ్చిపులుసు
కొద్దిగా చింతపండు నానపెట్టండి.తెల్లది ఐతె బావుంటుండి.ఓ చిన్న ఉల్లిపాయను చాలా
చిన్న ముక్కలుగ తరిగి పెట్టుకోవాలి.ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ని గ్యాస్ మంటపై
కాల్చి చిన్న ముక్కలుగ తరిగి పెట్టుకోవాలి.ఇప్పుదు ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కరివేపాకు
,కొత్తిమిర,తగినంత ఉప్పు,పావు స్పూను చక్కెర కలిపి పెట్టి ఇందులొ చింతపండు
నీళ్ళు కలపాలి.పుల్లగా కావాలనుకుంటె చిక్కగా పులుసు తీసుకోవాలి.లేదంటె
పలుచగా తీసుకోవాలి.ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,
కొద్దిగా పోపుగింజలు( ఎండుమిర్చి విత్తనాలు) వేసి అన్ని కలిపి పెట్టుకున్న పులుసులో
కలపి వెంటనే మూత పెట్టాలి.
అన్నంతో ఎన్నో వైరైటీలు
అన్నం మామూలుగా వండేసి పెట్టుకోండి.కాని పొడిపొడిగా ఉండాలి. మెత్తగా ఉంటే ఏమి చేయలేము.
1. ఒక గిన్నెలో ఒ గరిటెడు నూనె తీసుకునిఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,కాస్త
మినప్పప్పు,శనగపప్పు,కరివేపాకు పసుపు వేసి కాస్త వేగిన తర్వాత దింపేసి
ఓ నిమ్మకాయ పిండి ఉప్పు వేసి అన్నంలో కలిపేస్తే నిమ్మకాయ పులిహార రెడీ
2. పచ్చి కొబ్బరి ఉంటె తురిమి పెట్టుకోండి.గిన్నెలో నూనె వేసి , ఎండుమిర్చి పోపు
గింజలు వేసి చిటపటలాడాక కరివేపాకు,పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి
దించేయాలి. అన్నంలో తగింత ఉప్పు కలిపి పోపును,ఓ స్పూను నెయ్యి వేసి బాగా
కలిపి మూత పెట్టి ఓ పదినిమిషాల తర్వాత తిండానికి కొబ్బరి పులిహార రెడీ.ఇందులో
పసుపు వేయకూడదు. కొబ్బరి వేపకూడదు.
3. నిమ్మకాయ పులిహార ఎండుమిర్చి కాని పచ్చిమిర్చితో కాని చేసుకోవచ్చు.
అప్పుడప్పుడు అల్లం తురిమి పోపులో వేస్తె అదో అదిరే టేస్ట్.
4. క్యారట్,బీన్సు సన్నగా ముక్కలుగా కోసి కాస్త ఉడికించి పెట్టుకోవాలి. ఒక చిన్న
ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తర్రిగి,రెండు పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలి. బాణలిలో
నూనె వేసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,శనగపపు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ,
పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలు కొద్దిగా వేపి కొంచం అల్లంవెల్లుల్లి ముద్ద,
గరంమసాల,పసుపు వేసి మళ్ళి కాస్త వేపి అన్నం వేసి తగిన ఉప్పు వేసి అన్ని
కలిసేలా బాగా కలిపి ఓ రెండు నిమిషాలు వేపి దించి పెరుగు పచ్చడితో
లాగించండివెజ్ ఫ్రైడ్ రైస్.
5. చింతపండు పులుసు తీసిపెట్టుకుని నూనె వేడి చేసి ఇంగువ వేసి,ఆవాలు,జీలకర్ర,
ఎండుమిర్చి,శనగపప్పు,వేరుశనగ గుళ్ళు,కరివేపాకు వేసి వేగిన తర్వాత పులుసు
పసుపు,తగినంత ఉప్పు వేసి చిక్కబడి నూనె తేలేవరకు ఉడికించి దించేయాలి. ఈ
పులుసు వారం నిల్వ ఉంటుంది ఉప్పు సరిగ్గా ఉంటే.కావల్సినప్పుడు అన్నంలో తగినంత
పులుసు వేసి కలుపుకోడమే.రుచికరమైన పులిహార రెడి ఎప్పుడైనా.
6. కాస్త వేరైటీగ ఉండాలంటె కారం తగ్గట్టుగా ఎండుమిర్చి,కాస్త జీలకర్ర,మెంతులు,
నువ్వులు వేయించి పొడి చేసి మరుగుతున్న పులుసులో అప్పుడు ఎండుమిర్చి
వేయకూడదు.మిగతావన్ని అలాగే.
7. ఉల్లిపాయ,చిన్న అల్లం ముక్క,రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
గిన్నెలో నూనె వేడి చేసి జీలకర్ర,యాలకులు,లవంగాలు,దాల్చిన చెక్క,షాజీర
కొద్దిగా,ఉల్లిపాయలు, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేప అన్నం, తగినంత ఉప్పు
వేసి బాగ కలిపి కొద్దిగా వేపి దించేయాలి. అంతే జీరా రైస్ రేడీ.
8. అన్నంలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.లేదా అన్నం ఎప్పుడన్నా మెత్తబడితే
ఇలా చేసుకోవచ్చు.దానిని గరిటతో మెదిపి తగినంత ఉప్పు కలిపాలి. ఒక గిన్నెలో పాలు
ఇంక పెరుగు కలిపి పెట్టుకోవాలి.గిన్నెలో నూనె వేసి ఇంగువ వేసి ఎండుమిర్చి,ఆవాలు,
జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి వేపి పెరుగులో కలపాలి.కావాలంటె సన్నగా తరిగిన
అల్లం ముక్కలు పోపులో వెసుకోవచ్చు.బావుంటుంది. పెరుగు మిశ్రమాన్ని అన్నంలో
వేసి బాగా కలిపి అట్టే పెట్టి పది నిమిషాల తర్వాత తింటే సరి ఆవకాయనంజుకుంటూ.
ఇది ఎక్కువగా ప్రయాణాలకోసం చేసుకోవచ్చు.మొత్తం పెరుగుతో చేసుకుంటె అన్నం
పుల్లగ అవుతుంది.అందుకే సగం పెరుగు సగం పాలతో చేసుకోవాలి.అప్పుడు కమ్మగా
ఉంటుంది దధ్యోజనం దీనికి నిమ్మకాయ ఊరగాయ ఉంటె అదుర్స్.


