సేమ్యా 200 gm
బ్రెడ్ 1
గ్రుడ్లు 2
పంచదార 150 gm
యాలకులు 4
పాలు 500 gm
గ్రుడ్లను పగులగొట్టి గిలకొట్టి పాలు, పంచదార వేసి కలపాలి. బ్రెడ్ చుట్టూగల భాగాన్ని
తీసేసి తెల్లని భాగాన్ని పొడిగా చేసి సేమ్యా,యాలకుల పొడి పాలల్లో కలపాలి. గిన్నెలో
సగం వరకూ ఈ మిశ్రమాన్ని పోసి, పొయ్యి మీద వేరే పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి ఆ
నీటిలో ఈ పుడ్డింగ్ గిన్నె ఉంచి మూత పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఉడికితే
జున్నులా తయారవుతుంది. చల్లారనిచ్చి తింటే రుచిగా తియ్యగా చాలా బావుంటుంది.
త్వరగా జీర్ణమవడమేగాక ఇది బలవర్ధకమైన ఆహారం.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు