కోడి మాంసం 500 gm
పండుమిర్చి 6
ఉల్లిపాయలు 50 gm
అల్లం వెల్లుల్లి 2 tsp
లవంగాలు 4
జీలకర్ర 1/4 tsp
గరం మసాల 1/2 tsp
చింతపండు గుజ్జు 2 tbsp
ఉప్పు తగినంత
నూనె 50 gm
పండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద,లవంగాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయల్ని
కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలను దోరగా వేయించండి. అ తర్వాత ఈ మసాలా ముద్దను కూడా వేసి
కొద్దిగా వేపి కోడిమాంసం ముక్కల్ని వేసి పసుపు తగినంత ఉప్పు వేసి బాగా
కలియబెట్టి మూత పెట్టి సన్నటి మంటపై ఉడికించండి. చికెన్ ఉడకగానే చింతపండు
గుజ్జు కొత్తిమిర వేసి కొద్దిసేపు ఉడికించి నూనె తేలగానే గరం మసాలా వేసి కలిపి
దింపేయండి. ఇది అన్నంతో గాని, చపాతితో గాని భలే ఉంటుంది.
మీ పేరు చెప్పుకుని ఈ సంక్రాంతి రోజు మిరప కోడి కూర వండిచేశా మా ఆవిడ చేత. మీబ్లాగు ముందు పెట్టుకుని వండి వార్చేసింది. ఇప్పుడు మళ్ళీ తినబోయెముందు మీ కోసారి ధన్యవాదాలు.
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.
విహారి.
Happy Sankranti again J.
Glad to let you know that your blog appears in our Sankranti slide show.
Would appreciate if you link us.
Also, tell us how we can improve our content.
Best, Hyderabadiz Team