బియ్యం 500 gms
నెయ్యి 75 gms
పండుమిర్చి 5
చిక్కుడుకాయలు 100gms
చింతకాయలు 2
రేగిపండ్లు 5
వంకాయలు 3
చిలకడదుంప 1
ఉప్పు తగినంత
ఆవాలు చిటికెడు
జీలకర్ర చిటికెడు
ఇంగువ చిటికెడు
పసుపు చిటికెడు
కొత్తిమిర 1 కట్ట
ఒక మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి తాలింపు వేయాలి. ఆపైన ముక్కలుగా తరిగిన కాయగూరల్ని వేసి ఫ్రై చేసి పసుపు కలపండి. ఇందులో లీటరు నీళ్ళు,తగినంత ఉప్పు వేసి మరగనివ్వండి. తర్వాత కడిగిన బియ్యం వడపోసి ఇందులో వేయండి. పూర్తిగా ఉడికిన తర్వాత చిన్న మంటపై అయిదు నిమిషాలు ఉంచి దింపేయండి. కొత్తిమిర చల్లి పెరుగు పచ్చడితో వడ్డించండి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు