కందిపప్పు - 100 gms
ఎండుమిరపకాయలు - 6
జీలకర్ర - 1tsp
ధనియాలు - 1 tsp
నెయ్యి - 1 tsp
నూనె - tbsp
కరివేపాకు - 1రెబ్బ
చింతపండు - నిమ్మకాయంత
ముందుగా నెయ్యి వేడి చేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి తీసి పక్కన పెట్టి, ఆ తరవాత కంది పప్పును దోరగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించి మిగతా వస్తువులతో కలిపి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నెలలు చల్లుకుంటూ ముద్దగా రుబ్బుకోవాలి. తర్వాత నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు వేసి చిటపటలాడాక పచ్చడిలో కలపాలి. ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది.
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
thanks.caalaa easy annamaaTa.
dhanyavAdAlu jyOti gArU.. alA aDagaTam Alasyam ilA rAsEsAru! grET!!
జ్యోతీ
"నెలలు చల్లుకుంటూ " ఏంటబ్బా? నెలలు చల్లుకుంటూ, వెన్నెలలు చిమ్ముకుంటూ .. ఆహహా .. వొహొహూ :-)
మీరు బొమ్మలో చూపించిన పచ్చడిలో నీళ్ళు ఎక్కువయ్యాయి. :-)
రాధికా .. అవును, చాలా ఈజీయే .. ఎందుకంటే రుబ్బేది మీ వారుగదా! :-)
ఒక చిన్న చిట్కా. ఒకటి రెండు వెల్లుల్లి పాయలు (the pods, not the whole thing) తగిలించి రుబ్బితే, కంది పప్పు ఘుమఘుమకి మంచి కాంట్రాస్టు.
సాంప్రదాయకంగా .. కంది పచ్చడి కలుపుకున్నాకా, దాన్లోకి కొత్తావకాయో, గోంగూర ఊరగాయో నంచుకోవడం పరిపాటి.