తేనె ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం.ఆరోగ్యప్రదాయినిగా, సౌందర్య సాధనంగా తేనెకి
ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఆహారపదార్థాలలో తేనె
ఉత్తమమైనది.ఎంతో పుష్టికరమైనది. తేనెకి ఉండే విశిష్ట లక్షణాలు అన్నీ ఇన్నీ కావు.
పసిపిల్లల నుంచి వృద్దుల వరకు అన్ని వయసులవారు తేనెని ఆస్వాదించవచ్చు.
ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. క్రమం తప్పకుండా ప్రతి రోజు తేనెని తీసుకుంటే
జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. తేనెకి ఒక అరుదైన
గుణం ఉంది. రక్త నాళాల్లోకి త్వరగా ప్రవేశించి, రక్తంలో కలిసిపోయి సత్వరం శక్తిని
చేకూరుస్తుంది. వ్యాధుల నివారణలో, సౌందర్య పోషకత్వంలో తేనె విశిన్ష్టవంతమైనది.
పంచదార, బెల్లంకి బదులుగా తేనె వాడటం ఆరోగ్యకరం. పురుగుల్లాంటి కీటకాలు
కుట్టిన చోట మకరందాన్ని రాస్తే, త్వరగా ఉపశమనం లభిస్తుంది.గర్భిణీ స్త్రీలు
ప్రతిరోజూ తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయల్ని రోజుకొకటి చొప్పున తింటూ ఉంటే
పుట్టబోయే శిశువులకి ఎంతో బలవర్ధకం. అతిమూత్ర వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు
రాత్రిపూట పడుకునే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే, వ్యాధికి ఉపశమణం
లభిస్తుంది.ఓ కపు వేడినీటిలో రెండు చెంచాల తేనె కలిపి నెమ్మదిగా చప్పరిస్తుంటే
గొంతులో కఫం, దగ్గు తగ్గుతాయి.ప్రతిరోజు పరగడుపున రెండు ఔన్సుల తేనె
పుచ్చుకుంటే ఆరు నెలల్లో గుండె పని తీరు పెరిగి, దానికి పుష్టి చేకూరుతుంది.
వడదెబ్బ తగిలినప్పుడు తేనె నిమ్మరసం కలిపిన ద్రావణం ఎంతో
ఉపశమనాన్నిస్తుంది. ఓ కప్పు నీటిలో ఓ చెంచా తేనె కలిపి ప్రతిరోజు స్వీకరిస్తే
సుఖనిద్రపడుతుంది. అంతే కాదు అతిగా నిద్రని కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది.
తేనెలో లవంగాన్ని అరగదీసి కళ్ళలో వేసుకుని ఓ కప్పు కాచిన పాలల్లో పటిక
బెల్లం,తేనెలు కలుపుకుని తాగితే ఎంతటి తీవ్రమైన తలనొప్పి అయినా ఇట్టే
తగ్గుతుంది. తేనెలో నీరుల్లిరసం కలిపి తాగితే శరీరచాయ కాంతివంతమవుతుంది.
గ్లాసు బార్లీ నీళ్ళలో రెండు చెంచాల తేనె కలిపి ప్రతిరోజు తాగితే సుఖవిరేచనం
అవుతుంది.టమోటా రసాన్ని, తేనెని కలిపి తీసుకుంటే రక్తశుద్ధి, వృద్ధి
అవుతుంది. తేనెలో కొంచెం మిరియాల చూర్ణం కలిపి సేవిస్తుంటే ఉబ్బసవ్యాధి
నయమవుతుంది.తేనె, పంచదార, ద్రాక్షరసం ఈ మూడింటిని సమభాగాలుంగా
కలిపి తీసుకుంటే అజీర్ణవ్యాధి తగ్గుముఖం పడుతుంది. అల్లపురసం,తేనె
సమభాగాలుగా కలిపి పుచ్చుకుంటే ఆకలి వృద్ధి అవుతుంది.తేనె,శొంఠిపొడి కలిపి
తీసుకుంటే గొంతునొప్పి, జలుబు,గొంతులో మంట నివారింపబడుతుంది. తేనెలో
కొంచెం కుంకుమపువ్వు వేసి రోజు సేవిస్తుంటే రక్త ప్రసరణ, రక్తవృద్ధి బాగా
జరుగుతుంది. చర్మానికి మెరుపు వస్తుంది. చల్లని నీటితో శుభ్రపరచుకొన్న
ముఖానికి తేనెపట్తించి పావుగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల ముఖం నునుపు
తేలుతుంది. వెంట్రుకలకు తేనె అంటుకుంటే అవి తెల్లబడాతాయనేది కేవలం
అపోహ మాత్రమే. పిల్లలకి ప్రతిరోజు అరచెంచా తాగిస్తే వారిలో రోగనిరోధక శక్తి
పెరుగుతుంది. జలుబు, ఇతర అలర్జీల నుంచి తప్పించికోవాలంటే ఉసిరిరసం,
తేనె కలిపి తీసుకోవాలి. తేనెలో పలు రకాల పోషకపాదార్థాలు మనకు లభిస్తాయి.
పిండిపాదార్థాలు, విటమిన్లు, మొదలగునవి. శరీరధర్మాల్ని నిర్వహించడానికి
ఉపయోగపడే ఖనిజధాతువులైన రాగి, మాంగనీస్, పొటాషియం,లాంటివి కూడా
తేనెతో లభిస్తాయి. ఎన్నెన్నో ఉపయోగాలున్న స్వచ్చమైన తేనె, అందాన్ని
ఆరోగ్యాన్ని సం రక్షించే వరదాయిని,మకన్రందాన్ని మనసారా ఆస్వాదించి దాని
వల్ల ఎన్నో ఉపయోగాలని అందుకుందాం. జీవనాన్ని మకరంద వాహినిలా
కొనసాగిద్దాం.
0 వ్యాఖ్యలు