మినపప్పు 1 కప్పు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
పెరుగు 1 cup
ఉప్పు తగినంత
కారం 2 tsp
జీలకర్ర పొడి 1 tsp
కొత్తిమిర 2 tsp
పచ్చిమిర్చి 2
మినప్పప్పు శుభ్రం చేసి కడిగి నాలుగు గంటలు నీటిలో నానబెట్టాలి. తరువాత
నీరు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి.నూనె వేడి చేసి ఆ పిండితో వడలు చేసుకొని
ఎర్రగా వేయించాలి. ఈ వడలను గిన్నెలో నీళ్ళు పోసి అందులో వేసి ఉంచాలి.
పెరుగు చిలికి కారం,జీలకర్ర పొడి,సన్నగా తరిగిన పచ్చిమిర్చి,కొత్తిమిర,ఉప్పు
కలపాలి.వెడల్పాటి గిన్నెలో నీళ్ళనుండి తీసిన వడలు నీరంతా పిండేసి అమర్చి
పెరుగుని పోయాలి.పైన కొంచం కొత్తిమీర,బూందీతో అలంకరించి చల్లగా తినడమే.
ఎక్కువ చల్లగా కావాలంటే పెరుగుని అరగంట ఫ్రిజ్లో పెట్టాలి.
0 వ్యాఖ్యలు