ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి.
ఇది వేసవికాలం. అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు చెమట రూపంలో బయటకి వస్తుంది.
పెరిగిన ఉష్ణోగ్రత నుండి సహసిద్ధమైన విధానంలో మనల్ని మనం కాపాడుకునేందుకు నీరు
ఎక్కువగా త్రాగాలి.నీటితో పాటు ఇతర ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం చాలా అవసరం.
* మజ్జిగ,నిమ్మరసం, కొబ్బరినీరు, పండ్లరసాలు, రాగిజావ, బార్లీ నీరు మొదలైనవి
తరచుగా తీసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవిలో తలెత్తే
సమస్యలను నివారించవచ్చు వడదెబ్బ తగులకుండా తగిన శక్తిని పెంపొందించుకోవచ్చు.
కొద్దిపాటి శ్రద్ధ, ఆసక్తి వుంటే నిమిషాల వ్యవధిలో రుచికరమైన ద్రవపదార్థాలు తయరు
చేసి ఇంటిల్లిపాది ఆనందంగా సేవించవచ్చు.
* గుప్పెడు బార్లీ గింజలను నాలుగు గ్లాసుల నీళ్ళతో కలిపి కుక్కర్లో ఉడికించండి. వడ
కట్టి కొద్దిగా బెల్లం,ఉప్పు చేర్చి బార్లీ నీరు త్రాగండి.
* రాగిపిండిని రెండు స్పూన్లు తీసుకుని ఒక గ్లాసు నీళ్ళలో కలపండి. ఈ మిశ్రమాన్ని
రెండు గ్లాసుల మరుగుతున్న నీటిలో పోసి ఉండలు కట్టకుండా కలపండి. ఉడికిన
రాగిజావలో కొద్దిగా పాలు,బెల్లం కలిపి హాయిగా తాగండి. అభిరుచిని బట్టి మజ్జిగలో
కూడా కలిపి సేవించవచ్చు.
* సగ్గుబియ్యాన్ని నీళ్ళలో ఉడికించండి. పాలు, పంచదార లేక బెల్లం ఏలకులపొడి
వేసి తాగండి.
* పుచ్చకాయ ముక్కలలోనుండి గింజలు తీసేసి గ్రైండర్లో రసం చేసి చల్లచల్లగా తాగండి.
* కరివేపాకు, కొత్తిమిర, అల్లం సన్నగా తరిగి మజ్జిగలో కలపండి.కొద్దిగా ఉప్పు,
పచ్చిమిరప కాయలు కూడా కలపండి. మధురమైన రుచిలో వుండే మజ్జిగ సేవించి
వేసవి తాపము నుండి ఉపశమనం పొందండి.
* పది బాదం పప్పులను ఆరు గంటలపాటు నీటిలో నానబెట్టండి. తొక్క తీసి నీళ్ళతో
కలిపి మిక్సిలో వేయండి. ఆ బాదంపాలతో కొద్దిగా తేనె కలిపి అద్భుతమైన రుచితో
కూడిన పానీయం చేసుకోండి.
* బాగా పండిన 3 జామపండ్లను ముక్కలుగా కోసి మిక్సీలో వేయండి.రెందు గ్లాసుల
నీళ్ళు, ఒక స్పూను తేనె, కొద్దిగా నిమ్మరసం కలపండి.
* ఆరు ఖర్జూరపండ్లను గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తగిన నీరు పోసి
మిక్సీలో వేయండి. కావాలంటే పాలు కూడా కలపొచ్చు. నిమ్మరసం, ఏలకులపొడి,
బెల్లం కలిపి తీసుకోండి.
* నాలుగు అరటిపండ్లు, రెందు గ్లాసుల నీరు మిక్సీలో వేసి తిప్పండి. కొద్దిగా బెల్లం,
ఏలకుల పొడి కలిపి సేవించండి.
* రెండు క్యారట్లు, ఒక బీట్రూట్ ముక్కలుగా చేసి నీరు కలిపి మిక్సీలో వేయండి.
రసాన్ని వడకట్టి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తగండి.
* 2 మామిడిపండ్లు రసం తీసి పంచదార, పాలు, ఏలకులపొడి కలిపి తాగండి.
కృత్రిమంగా తయారుచేసిన జ్యూసులకంటే సహజసిద్ధమైన విధానంలో ఇంట్లో
పరిశుభ్రంగా చేసిన ద్రవాలు ద్రవపదార్థాలు, తాగడం ఎంతో మేలు.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు