శనగపప్పు 500 gm
బెల్లం 500 gm
మైదాపిండి 250 gm
నూనె అర కప్పు
నెయ్యి అరకప్పు
యలకుల పొడి 1 tsp
సోంఫు పొడి 3 tsp
శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. తర్వాత నీళ్ళు
వార్చి పప్పును బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బాలి.చివరలో యాలకులు,సోంఫు పొడులు
కలపాలి.ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.తరువాత మైదాపిండిలో
కొంచెం నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి.ఈ పిండిముద్దను కనీసం ఒక గంట అయినా
నాననీయాలి. నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చేతితో వెడల్పు
చేసి మధ్యలో పూర్ణం ఉండను పెట్టి చుట్టూ అంచులు మడిచి నూనె చెయ్యి చేసుకుని ప్లాస్టిక్
కాగితం మీద పూర్ణం బయటకు రాకుండా వెడల్పుగా చపాతీలా ఒత్తుకోవాలి. పొయ్యి మీద
పెనం వేడి చేసి ఈ బొబ్బట్టును నేతితో రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకుని
తీసుకున్న వేడి వేడి బొబ్బట్టుపై కాస్త వెన్న వేసుకు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న
అనుభూతి కలుగుతుందా చూడండి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు