నువ్వులు 250 gm
బెల్లం 250 gm
మైదాపిండి 250 gm
ఎండుకొబ్బరిపొడి అరకప్పు
యాలకుల పొడి 1 gm
నూనె అరకప్పు
నెయ్యి అరకప్పు
ముందుగా నువ్వులను శుభ్రపరచుకొని దోరగా వేయించుకోవాలి. పొడి చేసుకున్న బెల్లం,
నువ్వులు, కొబ్బరిపొడి కలిపి మెత్తగా దంచుకొని చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి.
మైదాపిండిలో కొంచెం నూనె, నీళ్ళు పోసి పూరిపిండిలా కలిపి రెండుగంటలు నాననివ్వాలి.
మైదాపిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని నూనె చేత్తో వెడల్పుగా వత్తుకొని మధ్యలో
నువ్వుల ఉండ పెట్టి అంచులు మూసేసి, చపాతీలా వత్తుకుని వేడి పెనంపై నెయ్యి వేస్తూ
కాల్చుకోవాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు