బొంబాయిరవ్వ 250 gm
పంచదార 250 gm
మైదాపిండి 250 gm
యాలకుల పొడి 1 tsp
నెయ్యి 50 gm
నూనె అర కప్పు
ముందుగా మందపాటి గిన్నెలో రెండు స్పూనుల నెయ్యి వేడి చేసి బొంబాయిరవ్వ పోసి
దోరగా వేయించుకోవాలి. మరో గిన్నెలో పంచదార యాలకులపొడి వేసి నీళ్ళు పోసి
మరిగిన తర్వాత రవ్వ పోసి ఉండకట్టకుండా నెయ్యేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి.
చక్కగా మగ్గిన తర్వాత దింపేయాలి. మైదాపిండిలో కొంచెం నెయ్యిగాని నూనె గాని
వేసి కొంచెం నీళ్ళు పోసి పూరిపిండిలా కలుపుకొని గంటసేపు నాననివ్వాలి. తర్వాత
పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకుని వెడల్పుగా వత్తుకుని మధ్యలో రవ్వ పూర్ణం
పెట్టి అంచులు మూసి పాలకవరుపై నూనె వేసి వెడల్పుగా పూరీల్లా వత్తుకుని వేడి
పెనంపై నెయ్యి వేస్తు నిదానంగా దోరగా కాల్చుకోవాలి. ఎక్కువ వేపితే
కరకరలాడతాయి. ఇవి మెత్తగా ఉండాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు