పెసరపప్పు 250 gm
పంచదార 250 gm
రవ్వ 250 gm
మైదా 100 gm
యాలకుల పొడి 1 tsp
నెయ్యి అరకప్పు
పెసరపప్పును శుభ్రపరచుకొని గంట సేపు నీటిలో నాననివ్వాలి. నానిన పప్పును
మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పప్పును ఆవిరిపై ఉడికించుకోవాలి. ఉడికిన
ముద్దను చల్లార్చి చిదిమి పొడి చేసుకుని పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగ
పాకం పట్టి పెసరపప్పు పిండిని పకంలో చేర్చాలి. ఉడుకుతుండగా అందులో కొంచెం
నెయ్యి,యాలకుల పొడి వేసి గట్టి పడేవరకు వుంచాలి. తర్వత దించేయాలి.
చల్లారాక చిన్న చిన్న వుండలు చేసుకుని వుంచుకోవాలి.మైదా, రవ్వ కలిపి
నీళ్ళు పోసి పూరిపిండిలా తడిపి గంట నాననివ్వాలి. ఒక పాలిధిన్ పేపర్కు నూనె
రాసి పూరిపిండిని చిన్న వుండలుగా చేసి వెడల్పుగా వత్తుకుని మధ్యలో రవ్వ
ముద్దను పెట్టి అంచులు మూసి నూనె చేతితో చపాతీలా వత్తుకుని వేడి పెనంపై
నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చుకోవాలి. ఇవి వేడిగా తింటే ఒక రకం రుచిగానూ,
చల్లారాక తింటే ఒక రుచిగాను ఉంటాయి. ఎలా ఇష్టం ఉంటే అలా తినవచ్చు.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు