"పుల్లనీ పుల్లట్టు పంటికందగానే జివసచ్చిన జిహ్వకే జీవమొచ్చెరా" అంటూ సినీకవి
పాటకోసం పదాలు కట్టాడేమోగాని నిజంగానే అట్టురుచి అమోఘం. కొన్ని పులిసిపోతే
రుచిలో వెలిసిపోతాయంటారు. అట్లు మాత్రం రోజు మారే కొద్దీ తీరు మార్చుకుంటాయి.
ఆబగా తినమంటాయి. మామూలు పచ్చళ్ళు, సాంబారు దేంట్లోకయినా కమ్మగా
వుంటాయి. అట్లకాడ కనికట్టు చేస్తుందో, పెనం మాయ చేస్తుందో తెలియదు గాని
అట్లు మాత్రం అద్భుతం.
దక్షిణాది రాష్ట్రాలలో బియ్యం, మినప్పప్పుతో కలిపి చేసుకునే వెరైటీలలో దోసెకే
ప్రధమస్థానం. కన్నడీయులు, తమిళులు,ఆంధ్రులు అందరూ ఏకగ్రీవంగా పిలుచుకునే
దోసె అంటే ఆబాలగోపాలానికి ప్రియమే. దోసెతో పాటు మన రాష్ట్రంలో చేసుకునే మరో
వెరైటీ అట్లు. దోసెకి, అట్టుకి తయారీ విధానంలో కొద్దిపాటి తేడాతో పాటు అట్టు కొద్దిగా
మందంగా రెండువైపులా దోరగా కాలి నోరూరిస్తూ వుంటుంది. వీతన్నింటిలోకి
దిబ్బరొట్టె ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో చాలా ఫేమస్.చాలా రుచిగా ఉండడమేగాక
ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుంది. నిప్పులమీద మందపాటి గిన్నెలో తయారుచేసే
ఈ రొట్టెను ఆధునికులకన్నా సంప్రదయవాదులు ఎక్కువగా ఇష్టపడతారు. ఒక్కొక్క
ప్రాంతంలో ఒక్కో అట్టు ప్రత్యేకతను సంతరించుకుంది.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు