ఆలూ బోండా

బంగాళదుంపలు 250 gm
ఉల్లిపాయలు 1
పచ్చిమిరపకాయలు 4
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
పసుపు 1/4 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
నూనె 3 tsp
శనగపిండి 200 gm
ఉప్పు తగినంత
కార0 1 tsp
ధనియాలపొడి 2 tsp
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి
శనగపిండిలో ఉప్పు, కారం, ధనియాలపొడి, వంటసోడా, నీళ్ళూ కలుపుతూ
గరిటజారుగా ఉండలులేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.
౨ స్ఫునుల నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు,
సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయముక్కలు,పసుపు వేసి మెత్త
బడేవరకు వేయించాలి.ఇప్పుడు ఉడికించి పొడి చేసి పెట్టుకున్న బంగాళదుంప
ముక్కలు,తగినంత ఉప్పు,కరివేపాకు వేసి కలిపి మూతపెట్టాలి.కొద్దిసేపు తర్వాత
కొత్తిమిర చల్లి దింపి చల్లారనివ్వాలి.
బంగాళదుంప కూరను చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి
ఒక్కొక్క ఉండను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి ఎర్రగా కాల్చి వేడి
వేడిగా వడ్డించాలి.












0 వ్యాఖ్యలు:
Post a Comment