పుదీనా - రెండు కట్టలు
పచ్చికొబ్బరి - అర చిప్ప
పచ్చిమిర్చి - మూడు
చింతపండు పులుసు - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - తగినంత
నూనె - రెండు స్పూన్లు
ముందుగా పుదీనా అకులను కోసి, ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
బాణలిలో ఒక స్పూను నూనె వేడి చేసి అందులో పుదీనా, ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిరపకాయల్ని వేసి వేయించి సన్నటి సెగ మీద బాగా మగ్గనివ్వండి. తర్వాత
దీనికి ఉప్పు, చింతపండు పులుసు, కొబ్బరి ముక్కల్ని కలిపి మెత్తగా రుబ్బి,పోపు
దినుసులతో తాలింపు పెట్టి దోసెలతో తినండి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు