పనీర్ 200 gm
ఉల్లిపాయ 1
క్యాప్సికం 1
మష్రూంస్ 3
కొత్తిమిర 2 tsp
మషాలా..
పెరుగు 1 కప్పు
అల్లం వెల్లుల్లి 1 tsp
కారం పొడి 1 tsp
చాట్ మసాలా 1 tsp
గరం మసాలా 1/2 tsp
జీలకర్ర పొడి 1 tsp
ఉప్పు తగినంత
తందూర్ కలర్ చిటికెడు
ముందుగా మషాలా సామానులన్ని కలిపి పెట్టుకోవాలి. పనీరును, కూరగాయలను అరంగుళం చదరపు ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. పనీర్ ముక్కలకు మసాలా అన్నివైపులా బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మిగతా మసాలాను కూరగాయలకు పట్టించాలి. వీటిని గంట అలా నాననివ్వాలి.లేదా కలిపి ఫ్రిజ్లో పెట్టి కావల్సినప్పుడు వేయించుకోవచ్చు. వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి గ్రీన్ చట్నీతో వడ్డించాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు