పావ్ లు ౧౨
ఉల్లిపాయలు ౨
బంగాళదుంపలు ౪
బఠానీలు 100 gm
బీన్సు 100gm
క్యారట్ 100 gm
క్యాప్సికం 100 gm
కాలిఫ్లవర్ 100 gm
కొత్తిమిర 1/2 cup
కారం పొడి 2 tsp
పావ్ బాజీ మసాలా 4 tbsp
టొమాటోలు 4
పసుపు 1 tsp
ధనియాల పొడి 4 tbsp
జీలకర్ర పొడి 2 tsp
పచ్చిమిరపకాయలు 2
ఉప్పు తగినంత
నిమ్మరసం 4 tsp
నూనె 5 tbsp
వెన్న 50 gm
ముందుగా అన్ని కూరగాయలు(టోమాటోలుతప్ప) చాలా చిన్న ముక్కలుగా కోసి
కొద్దిగా ఉడికించాలి.వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
మెత్తబడేవరకు వేయించాలి. సన్నగా తరిగిన టొమాటోలు,అన్ని మసాలాపొడులు
వేసి నూనె తేలేవరకు నిదానంగా వేయించాలి. తర్వాత ఉడికించి వార్చిన కూరగాయ
ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొద్దిగా వేపాలి.కప్పుడు నీరు పోసి
మెత్తగా ఉడికించాలి. ఉడికేటప్పుడు గరిటతో కాని , పప్పుగుత్తితోకాని,పొటాటోమాషర్
గాని ఉపయోగించి కలపాలి.అప్పుడు కూరగాయలన్నీ ముద్దలా అవుతాయి.చివరగా
మొత్తం ఉడికాక నిమ్మరసం,కొత్తిమిర, వెన్న కలిపి దింపాలి.
పావ్ లను మధ్యలో కోసి వెన్నతో వేడి పెనంపై కాల్చి ఈ కూరతో వడ్డించాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు