సెనగపిండి 250gm
పెరుగు 1 cup
అల్లం 1"
వంట సోడా లేదా ఇనో సాల్ట్ 1 tsp
పసుపు 1/4 tsp
నిమ్మరసం 1tsp
నూనె 1 tbsp
పోపుకి..
నూనె 3 tsp
ఆవాలు 1 tsp
కరివేపాకు 2 tsp
కొత్తిమిర 2 tbsp
జల్లించిన సెనగపిండి, పెరుగు,ఉప్పు,తగినంత నీరు కలిపి కాస్త చిక్కగా కలిపి కనీసం
నాలుగు గంటలు నాననివ్వాలి.పచ్చిమిర్చి,అల్లం ముద్ద, పసుపు అందులో వేసి
బాగా కలపాలి.ఒక పెద్ద గిన్నెలో నీరుపోసి వేడి చేయాలి.ఒక చిన్న గిన్నెలో సోడా లేదా
ఇనో సాల్ట్ , నూనె,నిమ్మరసం కలిపి పిండిలో వేసి బాగా కలియబెట్టాలి. ఒక వెడల్పాటి
గిన్నెకు( నీరు మరుగుతున్న గిన్నెలో పట్టేది) అన్నివైపులా నూనె రాసి ఈ పిండి
మిశ్రమం వేసి సమానంగా సర్ది పెద్ద గిన్నెలో మరుగుతున్న నీటిలో పెట్టి ఆవిరిపై పదిహేను
నిమిషలు ఉడికించాలి. చల్ల్లారాక ముక్కలుగా కోయాలి. ఇప్పుడు నూనె వేడి చేసి ఆవాలు
కరివేపాకు వేసి చిటపటలాడాక దింపి పావు కప్పు నీరు కలిపి ఈ ఢోక్లా ముక్కలపై
సమానంగా పోయాలి.ఆ నీటిని పీల్చుకుని అవి మృదువుగా అవుతాయి. కొత్తిమిర,
కొబ్బరి తురుముతో అలంకరించి వడ్డించాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు