మైదా 2 cups
గోధుమ పిండి 1 cup
నూనె 1 tbsp
ఉప్పు 1 tsp
తురిమిన కొబ్బరి 1 cup
సెనగపిండి 1/2 cup
నూనె 2 tbsp
కరివేపాకు 1 tsp
పచ్చిమిర్చి 2
అల్లం 1 tsp
కారం పొడి 1 tsp
జీలకర్ర 1/2 tsp
ఇంగువ చిటికెడు
ఉప్పు తగినంత
ముందుగా మైదా,గోధుమపిండి,నూనె,ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలిపి పక్కన
పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి అవాలు,కరివేపాకు వేసి వేగాక
సన్నగా తరిగిన పచ్చిమిర్చి,అల్లం ముక్కలు వేయించాలి.ఇప్పుడు తురిమిన కొబ్బరి
సెనగపిండి,కారం,ఉప్పు,వేసి బాగా వేపి కొద్దిగా నీరు పోసి మళ్ళీ కొద్ది సేపు వేపి
దింపేయాలి. చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.తడిపి పెట్టిన మైదా
గోధుమ పిండిని కూడా కాస్త పెద్ద ఉండలుగా చేయాలి. ఒక్క పిండి ముద్ద చేతితో
వెడల్పుగా చేసి అందులో కొబ్బరి ఉండ పెట్టి మూసేసి పూరీల్లా చేసుకుని వేడి నూనెలో
కాల్చాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు