బియ్యం 250 gm
చింతపండు పులుసు 1/4 cup
ఎండుమిరపకాయలు5
జీలకర్ర 1 1/2 tsp
ధనియాలు 1 tbsp
ఆవాలు 1/4 tsp
ఇంగువ చిటికెడు
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
వేరుశనగగుళ్ళు 3 tbsp
కరివేపాకు 2 tsp
నూనె 5 tbsp
ముందుగా ఎండుమిరపకాయలు,ధనియాలు,1 tsp జీలకర్ర కొద్దిగా వేపి
పొడి చేసిపెట్టుకోవాలి. అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్ళెంలో
వేసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేసి, ఆవాలు,
జీలకర్ర, వేరుశనగగుళ్ళు, కరివేపాకు వేసి చిటపటలాడాక చింతపండు
పులుసు, పసుపు,తగినంత ఉప్పు వేసి చిక్కబడి నూనె తేలేవరకు
మరిగించాలి.ఇప్పుడు మసాలా పొడి వేసి బాగా కలిపి దింపి అన్నంలో వేసి
బాగా కలియబెట్టాలి.పావు గంట అలా ఉంచి తినడమే ...మామూలుగా
చేసుకునే పులిహారలా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది. ఘాటుగా.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు