సెనగపిండి 400 gms
బియ్యప్పిండి 100 gms
కొత్తిమిర 4 కట్టలు
పచ్చిమిర్చి 2
ఉప్పు తగినంత
జీలకర్రపొడి 1 tsp
కారం 1 tsp
నెయ్యి 50 gms
నూనె వేయించడానికి
సెనగపిండి బియ్యప్పిండి కలిపి జల్లించండి. ఇందులో ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమిర, పచ్చిమిర్చి,జీలకర్ర పొడి, కారం కలపండి. పిమ్మట వేడి చేసిన నెయ్యిని పిండిలో పోసి బాగా కలపండి. తర్వాత తగు మాత్రం నీళ్ళు పోసి గట్టి ముద్దలా చేయండి. జంతికల గొట్టంలొ రిబ్బన్ ఆకారంలో ఉండే అచ్చును ఉంచి , ముందుగా కలిపిన పిండిని పెట్టి వేడి నూనెలో వత్తి ఎర్రగా వేయించాలి., నోరూరించే రిబ్బన్ పకోడి రెడీ.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు