పనీర్ 200 gms
బాస్మతి బియ్యం 500 gms
నూనె 50 gms
పచ్చిబఠాణి 50 gms
జీడిపప్పు 25 gms
తాజా కొబ్బరి తురుము 1/2 కప్పు
క్యారట్ తురుము 1/4 కప్పు
ఉల్లికాడల తురుము 1/4 కప్పు
చిల్లీ సాస్ 1 tsp
టొమాటో సాస్ 1 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద 1tsp
గరం మసాలా పొడి 1/2 tsp
మిరియాలపొడి 1/2 tsp
ఒక కళాయిలో కొద్దిగా నూనె వేడి చేసి అంగుళం ముక్కలుగా కోసిన పనీర్ ముక్కలు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. బియ్యం కడిగి కాస్త బిరుసుగా(పొడిపొడిగా) వండి పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లిముద్ద వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఉల్లికాడల తురుము, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి. చిల్లీసాస్, టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులోనే పనీర్, జీడిపప్పు ముక్కలు, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి. చివరగా తురిమిన కొత్తిమిర, కొబ్బరి కూడా చల్లి ఒక నిమిషం ఉంచి దింపేయాలి. పదినిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత తినాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు