బియ్యం 150 gms
బెల్లం 100 gms
నువ్వులు 20 gms
నూనె వేయించడానికి
మజ్జిగ అరకప్పు
బియ్యం కడిగి రెండు రోజులపాటు నానబెట్టండి. మధ్యలో ఒకసారి నీళ్ళు మార్చండి. రెండో రోజు నీళ్ళు వార్చి బియ్యాన్ని అరగంట సేపు నీడలో ఆరబెట్టి, మెత్తగా పిండి పట్టించండి. తురిమిన బెల్లం, అర కప్పు నీళ్ళు పోసి ముదురు పాకం పట్టండి.అర కప్పు నీళ్ళలో రెండూ మూడూ చుక్కల పాకం వేయండి. ఆ చుక్కలు నీటి అడుగున గట్టిపడి ఉండలా అయితే పాకం దించేయవచ్చు. ఈ పాకంలో బియ్యప్పిండిని, ఓ గరిటెడు నెయ్యి వేసి బాగ కలియబెట్టి పక్కన పెట్టాలి. మజ్జిగలో నువ్వులను పదినిమిషాలు నానబెట్టి తీసేయండి. బాణలిలో నూనె వేడి చేయాలి. పాకం పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని నువ్వులలో దొర్లించి, పాలిథిన్ పేపరుపై కాస్త నూనె రాసి, చేత్తో వెడల్పుగా ఒత్తి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేగిన వాటిని తీసి పీట మీద గట్టిగా ఒత్తాలి. అలా చేస్తే నూనె దిగిపోతుంది. నువ్వుల అరిసెలు సిద్ధం.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు