తాజా రొయ్యలు 250 gm
ఉల్లిపాయలు 100 gm
పచ్చిమిర్చి 6-8
పుదీన 1/2 కప్పు
కొత్తిమిర 1/2 కప్పు
అల్లం వెల్లుల్లి 2 tsp
గరం మసాలా 1 tsp
ఉప్ప్పు తగినంత
పసుపు 1/2 tsp
నూనె 4 tbsp
ముందుగా రొయ్యలు శుభ్రపరిచి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమిర,
అల్లంవెల్లుల్లి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోరగా అయ్యేవరకు వేయించి ఈ ముద్దను,
పసుపు కూడా వేసి కొద్దిగా వేపి రొయ్యలు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి
మూత పెట్టాలి. మసాలా బాగా వేగాకా గ్లాసుడు నీళ్ళు పోసి ఉడికించి నూనె
తేలగానే గరం మసాలా చల్లి దింపేయాలి.కావాలంటే రెండు పచ్చిమిర్చి తగ్గించి
కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.
0 వ్యాఖ్యలు