రొయ్యలు 250 gm
ఉల్లిపాయలు 2
టోమాటోలు 200 gm
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 1 కట్ట
నూనె 3 tbsp
టోమాటోలు మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి సన్నగా
తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేపి అల్లం వెల్లుల్లి,కరివేపాకు,పసుపు,కారం వేసి
కొద్దిగా వేపి రొయ్యలు,ఉప్పు వేసి కలియబెట్టి నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచి
కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత రుబ్బిన
టోమాటోల ముద్ద,గరం మసాలా,వేసి నూనె తేలేవరకు నిదానంగా ఉడికించి
కొత్తిమిర చల్లి దింపేయాలి.
0 వ్యాఖ్యలు