రొయ్యలు 250 gm
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 1 tsp
ధనియాల పొడి 2 tsp
కొత్తిమిర 1 కట్ట
కొబ్బరి పొడి 2 tbsp
గసగసాలు 2 tsp
గరం మసాలా 1 tsp
పెరుగు 1 కప్పు
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
నూనె 3 tbsp
కొబ్బరి, గసగసాలు కలిపి నూరి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు
ఎర్రగా వేపి అల్లం వెల్లుల్లి,కరివేపాకు,పసుపు,ధనియాల పొడి కారం వేసి కొద్దిగా
వేపి రొయ్యలు తగినంత ఉప్పు వేసి కలియబెట్టి నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచాలి.
ఇప్పుడు కొబ్బరి ముద్ద,గరం మసాలా,కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి.రొయ్యలు
ఉడికిన తర్వాత పెరుగు చిలికి అందులో కలిపి నూనె తేలేవరకు ఉంచి కొత్తిమిర
చల్లి దింపేయాలి.
0 వ్యాఖ్యలు