పచ్చి రొయ్యలు 250 gm
ఉల్లిపయలు 4
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 2 tsp
కొబ్బరి పొడి 3 tbsp
గరం మసాలా 1 tsp
పసుపు 1/4 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
రొయ్యలు వలిచి,శుభ్రంగా కడిగి వుంచుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి
సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేపి అల్లం వెల్లుల్లి,పసుపు,కారం,
కరివేపాకు వేసి కొద్దిసేపు వేపి రొయ్యలు,ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత
పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి. రొయ్యలు
ఉడికిన తర్వాత కొబ్బరిపొడి,గరం మసాలా కలిపి మరో ఐదు నిమిషాలు
ఉడికించి కొత్తిమిర చల్లి దింపేయాలి.
0 వ్యాఖ్యలు