పచ్చికొబ్బరి తురుము - 3 కప్పులు
బియ్యం పిండి - 2 కప్పులు
బెల్లం - 2 కప్పులు
పంచదార - 5 చెంచాలు
యాలకుల పొడి - 2 చెంచాలు
నెయ్యి - 4 చెంచాలు
జీడిపప్పు పలుకులు - అర కప్పు
ముందుగా బాణలిలో నెయ్యి వేడి చేసి, అందులో కొబ్బరిని కొంచెం వేయించి,
అందులో బెల్లం కలిపి ఉడకనివ్వాలి.జీడిపప్పు పలుకులను కూడా వేసి
మాడకుండా కలుపుతూ ముద్దగా అయ్యేవరకు ఉడికించాలి. తర్వాత
దింపేయాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని పంచదార, యాలకులపొడి,
నెయ్యి వేసి అరకప్పు నీళ్ళు పోసి బాగా మరిగించాలి. దింపేసి అందులో
బియ్యం పిండీని పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం గట్టిగా
ఉండాలి. పలుచగా ఉంటే కొంచెం పిండిని వేసి కలపవచ్చు. కొబ్బరి
మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. బియ్య్యం పిండిని
కాస్త పెద్ద ఉండను తీసుకుని వెడల్పుగా తట్టి, దాని మధ్యలో కొబ్బరి
ఉండను పెట్టి మూసేసి కావల్సిన ఆకారంలో చేసుకోవచ్చు. కావాలంటే
బియ్యం పిండిలో కేసరి రంగును కాని, కుంకుమపువ్వు కాని వేసుకోవచ్చు.
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
0 వ్యాఖ్యలు