Monday, December 31, 2007

రాగి తీపి దోసెలు

రాగిపిండి 250 gms
బెల్లం 150 gms
కొబ్బరి చిన్న ముక్క
వేరుశనగపప్పు 50 gms
నూనె 1 త్స్ప్

ఒక గ్లాసు నీటిలో బెల్లం కరిగించాలి.వేరుశెనగపప్పును వేయించి పొడి చేసుకుని, కొబ్బరితో కలిపి ఉంచుకోవాలి. కరిగిన బెల్లంలో రాగిపిండి వేసి దోసెలపిండిలాగా కలపాలి. పెనం కాలిన తర్వాత దోసె పోసి నూనె వేసి కాలనివ్వాలి. రెండవ వైపు కూడా కాలిన తర్వాత మధ్యలో ఒక స్పూను తురిమిన కొబ్బరి, వేరుశెనగపప్పు పొడి కలిపి మడతపెట్టాలి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

0 వ్యాఖ్యలు: