గుమ్మడికాయ 250 gms
పచ్చిమిర్చి 6
మిరియాలు 1 tsp
జీలకర్ర 1/2 tsp
శనగపప్పు 2 tsp
తాలింపు గింజలు 1/2 tsp
నూనె 3 tsp
అల్లం చిన్న ముక్క
తురిమిన కొబ్బరి 3 tbsp
ధనియాలు 1 tsp
ఇంగువ చిటికెడు
బియ్యం 2 tbsp
ఎండుమిర్చి 2
పసుపు చిటికెడు
కరివేపాకు 2 రెబ్బలు
ఉప్పు తగినంత
గుమ్మడికాయ చెక్కు తీసి కొద్దిగా సన్నని ముక్కలుగా తరిగి కాసిన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. ఉప్పు, పసుపు, కారం వేయాలి. ధనియాలు, ఇంగువ,మిరియాలు, జీలకర్ర కలిపి కొద్దిసేపు వేయించి పొడి చేసి ఉడికే గుమ్మడి ముక్కలలో వేయాలి. ముందుగానే శనగపప్పు,బియ్యం కొద్దిసేపు నానబెట్టి రుబ్బి గరిట జారుగా చేసుకుని గుమ్మడి ముక్కలలో వేయాలి. బాగా ఉడికిన తర్వాత దించి పోపు పెట్టాలి. కరివేపాకు ,కొత్తిమిర,కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. ఈ పిండి మిరియం ఘుమఘుమలాడుతూ రుచిగా ఉంటుంది.వేడిమీదనే తింటే బావుంటుంది.
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
0 వ్యాఖ్యలు