గుమ్మడికాయ 250 gms
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
బెల్లం 50 gms
కారం 1 tsp
ఉప్పు తగినంత
పస్పు చిటికెడు
ఇంగువ చిటికెడు
ధనియాలు 1 tsp
మెంతులు 1/2 tsp
పోపు గింజలు 1 tsp
ఎండుమిర్చి 2
నూనె 2 tsp
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 1 కట్ట
శనగపిండి 2 tbsp
చింతపండు పెద్ద నిమ్మకాయంత
గుమ్మడికాయ చెక్కు తీసి బాగా పెద్ద ముక్కలు తరగాలి.ఉల్లి, పచ్చిమిర్చి,తరిగి అందులో వేసి కాసిన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. చింతపండు కడిగి నానబెట్టి పులుసు తీసి ఉడికిన గుమ్మడి ముక్కలలో పోయాలి. కారం, బెల్లం, పసుపు , ఉప్పు కూడా వేయాలి. ధనియాలు, ఇంగువ, మెంతులు కలిపి ఎర్రగా వేయించి పొడి చేసి పులుసులో వేయాలి.ఈ పొడి వేసినందువల్ల పులుసు రుచి ఎక్కువగా ఉంటుంది. పులుసు బాగా ఉడికిన తర్వాత శనగపిండి కొద్దిగా నీళ్ళలో కలిపి పులుసులో పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.కాసేపు ఉడికిన తర్వాత దింపి పోపు పెట్టాలి. కరివేపాకు, కొత్తిమిర కూడా కలపాలి. ఈ ధప్పళాన్ని చేసి, చూసి తింటే తెలుస్తుంది దీని రుచి అమోఘం.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
1 year ago
0 వ్యాఖ్యలు