రాగులతో శిశు ఆహారం
రాగులు 60 gms
వేయించిన పెసరపప్పు 15 gms
వేయించిన నువ్వులు 5 gms
వెన్న తీసిన పాలపొడి 15 gms
వేరుశనగపప్పు 10 gms
రాగులను ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం వాటిని పళ్ళెంలో ఆరబెట్టి తడిగుడ్ద కప్పి ఒక రోజంతా అలాగే ఉంచాలి. మరుసటిరోజుకి రాగులు మొలకెత్తుతాయి. మొలకెత్తిన రాగులను ఎండబెట్టాలి. ఎండాక దోరగా వేయించి పొడి చేయాలి. ఇతర దినుసులను కూడా విడివిడిగా పొడికొట్టి పాలపొడిలో కలిపి గాలి చొరరాని డబాలలో నిల్వ చేసుకోవాలి. పిల్లలకి తినిపించేటప్పుడు పొడికి 100 ml పాలు కలిపి తినిపించవచ్చు.












0 వ్యాఖ్యలు:
Post a Comment