Wednesday, November 29, 2006

కైమా ఉండల కూర


మెత్తటి ఖైమా 250 gm
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 3
కొబ్బరిపొడి 50 gm
కారంపొడి 2 tsp
పసుపు 1/4 tsp
ధనియాల పొడి 2 tsp
గరం మసల పొడి 1 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
నూనె 4 tbsp
ఉప్పు తగినంత


ముందుగా ఖైమాలో తగినంత ఉప్పు, సగం కారం, పసుపు, ధనియాల

పొడి ,గరం మసాలా, అల్లం వెల్లుల్లి, సగం కొబ్బరి పొడి వేసి బాగా కలిపి

వీలైతే రోట్లో కొద్దిగా దంచి తడి చేత్తో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని

పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు

వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.ఇప్పుడు నిలువుగ తరిగిన

పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి వేసి బాగా

వేపి ఈ ఖైమా ఉండలను అందులో వేసి తగినంత ఉప్పు వేసి కలిపి

మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక కొబ్బరి పొడి, గ్లాసుడు నీళ్ళు

పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి.నూనె తేలాక కొత్తిమిర గరం మసాలా

చల్లి దించేయాలి.

Tuesday, November 28, 2006

జిలేబీ




మైదా 1 1/2 కప్పులు

చక్కెర 3 కప్పులు

వంట సోడా చిటికెడు

యాలకుల పొడి 1/2 tsp

నెయ్యి లేదా నూనె వేయించడానికి

పసుపు లేదా కేసర్ రంగు చిటికెడు



మైదాలో వంటసోడా వేసి నీరు పోసి చిక్కగా ఉండలు లేకుండా కలిపి

రాత్రంతా అలాగే ఉంచాలి. పిండి బాగా పులిసి తీగ లాగా సాగితేనే

జిలేబీ బాగా వస్తుంది.మరునాడు పొద్దున్న పిండిని మళ్ళీ కలిపి కాస్త

కావాలంటే కస్త రంగు,నీరు కలిపి గరిటజారుగ కలిపి పెట్టుకోవాలి.

చక్కెరలో అరగ్లాసు నీరు పోసి మరిగించి తీగ పాకం పట్టి ఉంచుకోవాలి.

అందులోనే యాలకులపోడి కలిపాలి. జిలేబీలు చేయడానికి ఒక

మందపాటి గుడ్డకు చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి

చుట్టలాగ పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి. జిలేబీలు

చేయడానికి సీసాలాంటివి దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో.

జిలేబీలను ఎర్రగా వేయించి తీసి పాకంలో వేయాలి. పదినిమిషాల

తర్వాత తీసి విడి పళ్ళెంలో పెట్టాలి.

కాజు బర్ఫీ


జీడిపప్పు పొడి 3 1/2 కప్పులు

చక్కెర 1/12 కప్పులు

నీరు 1 1/2 కప్పులు

నెయ్యి 1 1/2 tbsp

వెండి కాగితం కావల్సినంత



ముందుగా చక్కెర నీరు కలిపి మరిగించి ముదురుపాకం చేసి నెయ్యి

కలిపిదించేయాలి. ఇప్పుడు జీడిపప్పు పొడి అందులో వేసి బాగా కలిపి

చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ ముద్దను చపాతీపిండిలా మర్ధన చేసి.

కాస్త మందమైన చపాతీలా వత్తుకోవాలి.స్వీట్లపై వేసే వెండి కాగితం

పరిచి చదరపు ముక్కలుగ కోసుకోవాలి.ఇవి వారం పది రోజులు

నిల్వ ఉంటాయి.

Saturday, November 25, 2006

పాలకూర పకోడీ


పాలకూర 2 కప్పులు

శనగపిండి 1 కప్పు

ఉల్లిపాయలు 200 gm

కారంపొడి 1 tsp

పసుపు చిటికెడు

వాము 1 tsp

ధనియాల పొడి 2 tsp

ఉప్పు తగినంత

నూనె వేయించదానికి



ముందుగా పాలకూరను కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు

కూడా సన్నగా నిలువుగా తరిగి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో

ఉల్లిపాయలు వేసి చెతితో బాగా పిసికి అందులో పాలకూర, శనగపిండి,

కారం, పసుపు,వాము,ధనియాల పొడి వేసి బాగా కలిపి కాగిన


నూనెలో చిన్న చిన్న ముద్దలుగా, పొడిపొడిగా వేసి ఎర్రగా కాల్చాలి.

ఇందులొ కూడా నీరు పోయనవసరం లేదు. పాలకూర,ఉల్లిపాయల


తడి సరిపోతుంది.

ఉల్లిపాయ పకొడీ







ఉల్లిపాయలు 250gms
శనగపిండి 200 gms
కారం పొడి 1 tsp
గరం మసాలా 1/4 tsp
ధనియాల పొడి 2 tsp
వాము లేక జీలకర 1 tsp
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత


ఉల్లిపాయలు సన్నగా, పొడవుగా తరగాలి. అవి చేతితో బాగా పిసికి
విడివిడిగా చేయాలి. ఇప్పుడు నూనె తప్ప మిగతా వస్తువులన్నీ
వేసి బాగా కలిపి ఉంచాలి. నీరు పోయకూడదు. ఉల్లిపాయల తడి
మాత్రమే చాలు. కాగిన నూనెలో చిన్న చిన్న ముద్దలుగ పొడి
పొడిగా వేసి ఎర్రగా వేయించాలి. అంతే.

వెజ్ టబుల్ సమోసా


బంగాళదుంపలు 200 gm
క్యారట్ 1
ఉల్లిపాయలు 2
బటాణీలు 50 gm
పసుపు చిటికెడు
మైదాపిండి 250 gm
కారం పొడి 1 tsp
కొత్తిమిర 3 tsp
నిమ్మకాయ 1
ఉప్పు సరిపడ
నూనె వేయించడానికి

పిండిలో కొద్దిగా ఉప్పు 1 చెంచా నూనె వేసి నీరు పోసి చపాతీ పిండిలా కలిపి
మూత పెట్టి ఉంచాలి. బంగాళదుంప,క్యారట్ను ముక్కలుగా కోసి బటాణీ
కలిపి ఉడికించాలి. బాణలిలో నూనె వేసి తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా
వేపి దానికి ఉడికించిన కూరగాయలు వేసి కారం, ఉప్పు, పసుపు వేసి
నీరంతా పోయేదాకా వేపి దించేయాలి.కొత్తిమిర చల్లి నిమ్మరసం పిండి
బాగా కలిపి ఉంచాలి.చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకుని
చపాతీలా చేసి వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర
మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.అంచులు గట్టిగ వత్తి
కాగిన నూనెలో ఎర్రగా వేయించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Friday, November 24, 2006

బటన్ ఇడ్లీ పెరుగు వడ

చిన్న చిన్న ఇడ్లీలు చేసే పాత్రలు కూడా ఉంటాయి వీటినే బటన్ ఇడ్లీలంటారు.ఇవి కూడా మిగిలిపోతే చక్కగా పెరుగువడ చేసుకోవచ్చు

.బటన్ ఇడ్లీలు 10
పెరుగు 250 gm
మజ్జిగ 150 gm
ఎండుమిర్చి 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
మినప్పప్పు 1tsp
శనగపప్పు 2 tsp
క్యారట్ 1
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
నూనె 2 tsp


నూనె వేడి చేసి బటన్ ఇడ్లీలను బాగా వేయించాలి.వీటిని ఉప్పు
కలిపిన మజ్జిగలో వేయాలి.2 tbsp నూనెను వేడి చేసి

ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు,శనగపప్పు,కరివేపాకు
వేసి కాస్త వేగాక మజ్జిగలో కలపాలి.పెరుగును కూడా ఉప్పు
కలిపి బాగా చిలికి ఇందులోనే వేయాలి.సన్నగా తురిమిన

క్యారట్,కొత్తిమిర చల్లి వడ్డించాలి.

మైసూరు ఉప్మా

ఇడ్లీలు 8
వేరుశనక్కాయలు 50 gm
ఆవలు 1/2 tsp
జీలకర్ర 1 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 2 tsp
ఎండుమిర్చి 2
అల్లం 1''
'పసుపు కొద్దిగా
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
నిమ్మరసం 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp


ఇడ్లీలను మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి
చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మినప్పప్పు,
శనగపప్పు,వేరుశనగ గుళ్ళు,కరివేపాకు పసుపు వేసి కొద్దిగా వేపాకా
దింపేయాలి.ఇప్పుడు ఇందులో ఇడ్లీపొడిని,తగినంత ఉప్పు కొద్దిగా
నిమ్మరసం,కొత్తిమిర వేసి బాగా కలిపి కొత్తిమిర చట్నీతో వడ్డించాలి.

ఇడ్లీ ఫ్రయంస్

ఇడ్లీలు 6
కారం పొడి 2 tsp
ధనియాల పొడి 2 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి


ఇడ్లీలను సన్నగా నిలువుగా కోసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి
సన్నగా కోసిన ఇడ్లీ ముక్కలను బాగా కరకరలాడేలా వేయించాలి.
నూనెలోంచి తీసి పైన ధనియాల పొడి, కారం, ఉప్పు చల్లి టమాటా
సాస్ తో వడ్డించాలి. ఇవి వేడిగా ఉన్నప్పుదే తినాలి. చల్లారితే గట్టిగా
ఉంటాయి.

ఇడ్లీ డోక్లా

ఇడ్లీలు 4
మజ్జిగ 2 కప్పులు
పసుపు 1/2 tsp
జీలకర్ర 1/4 tsp
ఆవాలు 1/4 tsp
ఇంగువ చిటికెడు
కొత్తిమిర 3 tsp
కరివేపాకు 1 tsp
పచ్చిమిర్చి 4
ఉప్పు తగినంత


ఇడ్లీలను చిన్న చదరపు ముక్కలుగా కోయాలి. వెడల్పాటి గిన్నెలో
పద్దతిగా అమర్చాలి. బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ, ఆవాలు,
జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు,పసుపు,వేసి వేపాక నీరు
లేదా మజ్జిగ పోయాలి (ఉప్మా పద్దతిలో)తగినంత ఉప్పు,వేసి బాగా
మరిగాక ఇడ్లీలపై పోయాలి అన్నీ మునిగేదాకా.ఇడ్లీ ముక్కలు
నీరంత పీల్చుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమిర చల్లాలి.

ఇడ్లీ తీపి పొంగలి

ఇడ్లీలు 4
బెల్లం సరిపడ
యాలకులు 3
జీడిపప్పు 5
కిస్మిస్ 5
నెయ్యి 2 tsp


ఇడ్లీలను చిదిమి పెట్టుకోవాలి.బాణలిలో కొంచెం నెయ్యి వేడి చేసి కిస్మిస్,
జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురిమిన బెల్లం కొద్దిగా
నీరు కలిపి బాణలిలో వేసి సన్న మంట మీద ఉంచాలి. పై పాకంలో
ఇడ్లీ పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. బెల్లం
అంతా కరిగేవరకు ఇలా కలిపి దించేయాలి. కిస్మిస్, జీడిపప్పు కలిపి
వేడిగా వడ్డించాలి. ఇది పూర్తిగా సన్నని మంటపైనే చేయాలి.

కంచి ఇడ్లీ


మినప్పప్పు 1 గ్లాసు
ఇడ్లీ రవ్వ 2 1/2 గ్లస్సులు
ఉప్పు తగినంత
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
మినప్పప్పు 2 tsp
శనగపప్పు 3 tsp
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 tsp
నూనె 5 tsp


ముందుగా పప్పు, రవ్వను బాగు చేసుకుని నీళ్ళు పోసి నానబెట్టిపప్పును
మెత్తగా రుబ్బుకోవాలి.రవ్వలో నీళ్ళు పిండేసి అందులొ వేసి తగినంత
ఉప్పు వేసి కలిపి ఆరు గంటలపాటు ఉంచేయాలి.శనగపప్పు గంట
నానబెట్టి పిండిలో కలపాలి. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి
చిటపటలాడాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి,కరివేపాకు, మినప్పప్పు
వేసి వేగిన తర్వాత ఈ రుబ్బిన పిండిలో వేసి కలిపి ఇడ్లీలు
చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.

ఇడ్లీ



మినప్పప్పు 1 గ్లాసు

ఇడ్లీ రవ్వ 21/2 గ్లాసులు

ఉప్పు తగినంత


ముందుగా పప్పు, రవ్వను బాగు చేసుకుని విడివిడిగా నీళ్ళు పోసి
కనీసం నాలుగు గంటలు నానపెట్టాలి. పప్పును మెత్తగా కాటుకలా
రుబ్బుకోవాలి. రవ్వలో నీరు పిండేసి పప్పులో వేసి తగినంత ఉప్పు
కలిపి మొత్తం బాగా కలిపి ఆరుగంటలపాటు అలా ఉంచేయాలి.
పిండి పులిస్తేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో
ఇడ్లీలు వేసి ఆవిరిమీద ఉడికించుకోడమే.దీనికి కొబ్బరి పచ్చడి,
కారప్పొడి, సాంబారు ఉండాలి.

Monday, November 20, 2006

క్యాబేజీ కూర
















క్యాబేజీ 250gm
ఎండు మిర్చి 6
ఆవాలు 1/2gm

జీలకర్ర 1/2gm

పసుపు 1/2gm

మినప్పప్పు 1 tbsp

శనగపప్పు 2 tbsp

కరివేపాకు 1 రెబ్బ

కొత్తిమిర 2 tbsp

నూనె 3 tbsp

ఉప్పు తగినంత



ముందుగా క్యాబేజీని చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేడి
చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు,శనగపప్పు, పసుపు
వేసి కొద్దిగా వేపి క్యాబేజీ, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ఇది చిన్న మంటపై
నూనెలోనే మగ్గిపోతుంది.చివరగా గరం మసాల, తరిగిన కొత్తిమిర చల్లి దించేయడమే.
ఇది చపాతీలలోకి, అన్నంలోకి చాలా బావుంటుంది త్వరగా చేసుకోవచ్చు కాని
క్యాబేజీని మాత్రం చాలా సన్నగా దారాల్లాగా తరగాలి.

నువ్వుల లడ్డు



తెల్ల నువ్వులు 250 gm
బెల్లం 250 gm
నెయ్యి 2 tsp
ఏలకులు 4



బెల్లం కరిగించి వడకట్టుకోవాలి.నువ్వులు ఖాలీ బాణలిలో దోరగా వేయించాలి. నువ్వు

పప్పు నొట్లో వేసుకుంటే గుల్ల విచ్చినట్టు ఉండాలి. బెల్లం ముదురు పాకం చేయాలి. ఒక

చిన్న పళ్ళెంలో నీళ్ళు పోసి రెందు చుక్కలు పాకం అందులో వేస్తే అది వెంటనె ఉండ

కట్టాలి. ఆ ఉండను నేలకేసి కొడితే విరగొద్దు.ఇప్పుడు నెయ్యి, ఏలకుల పొడి నువ్వులు

అన్నీ వేసి బాగా కలిపి దించి. నెయ్యి రాసిన పళ్ళెంలో చిన్న గరిటతో ఈ నువ్వుల

పాకాన్ని కొద్ది కొద్దిగా వేసి చేయి తడి చేసుకుంటూ జాగ్రత్తగా వేడి మీదనే ఉండలుగ

చేసుకోవాలి. కొద్దిగ అలవాటు పడితే తొందరగా చేయొచ్చు. అరగంట ఆరిన తర్వాత

డబ్బాలో వేసి పెట్టుకోడమే.

Saturday, November 18, 2006

మజ్జిగ పులుసు


మజ్జిగ 200 gm
సెనగపిండి 150 gm
ధనియాలపొడి 2 tbsp
పచ్చిమిర్చి 2
ఎండుమిర్చి 3
ఆవాలు 1/4 gm
జీలకర్ర 1/4 gm
మినప్పప్పు 1/2 gm
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
నెయ్యి 2 tbsp
నూనె



ముందుగా మజ్జిగ,1 tbsp ధనియాల పొడి,పసుపు,ఉప్పు,50 gm సెనగపిండి
అన్నికలిపి చిలికి పెట్టాలి. మిగిలిన సెనగపిండిలో తగినంత ఉప్పు కొద్దిగా కారం,
ధనియాల పొడి,చిటికెడు వంట సోడా వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్ళు పోసి బజ్జీల
పిండిలా కలిపి పెట్టుకోవాలి. గిన్నెలో నెయ్యి వేడి చేసి ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర
వేసి చిటపటలాడాక కరివేపాకుమినప్పప్పు వేసి కొద్దిగా వేపి కలిపి పెట్టుకున్న
మజ్జిగను అందులో పోయాలి. రెండు నిమిషాలు మరగగానే కొత్తిమిర వేసి
దించేయండి. బాణలిలో నూనె వేడి చేసి సెనగపిండితోచిన్న బజ్జీలలా వేయించి
ఈ మజ్జిగ పులుసులో కలపాలి .ఈ బజ్జీలను ఎక్కువ సేపు మజ్జిగలో ఉంచితే
అవి మెతబడిపోతాయి. అందుకే తినేముందు వేస్తే సరి. మజ్జిగ పుల్లగా
ఉంటేనే బావుంటుంది.

బంగాళ దుంప వేపుడు


బంగాళ దుంపలు 250 gm
ఉల్లిపాయలు 3
పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెబ్బలు
పసుపు చిటికెడు
కారంపొడి 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp


బంగాళదుంపలను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్ళలో వేసి ఉంచాలి.
ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ముక్కలు
వేసి అవి గోధుమ రంగు వచ్చేవరకు వేయించి పసుపు,కారం పొడి వేసి కలిపి
బంగాళదుంప ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలిపి మూతపెట్టాలి. ఓ పది
నిమిషాలలో కూర తయారవుతుంధి.నీళ్ళు పోసే పని కూడా లేదు.కాని నిదానంగా
ఉడకనివ్వాలి. గరం మసాల ,కొత్తిమిర చల్లి దించేయడమే. ఇది అన్నం ఇంకా
రొట్టెలలోకి బావుంటుంది.

రవ్వ లడ్డు




బొంబాయి రవ్వ 250 gms
పంచదార 250 gms
ఎండు కొబ్బరి పొడి 50 gms
ఏలకులు 4
జీడిపప్పు 10
కిస్మిస్ 10
నెయ్యి 50 gms
పాలు 100 ml





ముందుగా నెయ్యి కరిగించి జీడిపప్పు,కిస్మిస్ కొద్దిగా వేయించి అందులోనే రవ్వను

కమ్మని వాసన వచ్చేవరకు దోరగా వేయించాలి.పంచదార ఏలకులు కలిపి మెత్తగా

పొడి చేసుకోవాలి. వేయించిన రవ్వ,ఎండుకొబ్బరిపొడి,పంచదార పొడి,అన్ని బాగా

కలిపి కొద్దికొద్దిగా పాలు చల్లుకుంటూ ఉందలుగ చేసి పెట్టుకోవాలి. ఇవి 15 రోజుల

వరకు నిలువ ఉంటాయి. త్వరగా చేయొచ్చు కూడా.

Friday, November 17, 2006

సెనగ పిండి లడ్డు





సెనగపిండి 100 gms
పంచదార 100 gms
కోవా 50 gms
నెయ్యి 50 gms
ఏలకులు 5



బాణలి వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసి సెనగపిండిని కమ్మని వాసన వచ్చేవరకు నిదానంగా
వేయించాలి. పంచదార ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసిపెట్టుకోవాలి.కోవాను కూడా కొద్దిగా

వేపి సెనగపిండి,పంచదారపొడి అన్ని బాగా కలిపి కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టాలి.

కోవా లేకున్నా పర్వాలేదు. చాలా తొందరగా చేయొచ్చు.

సున్నుండలు



మినప్పప్పు 100 gms
పంచదార 100 gms
ఏలకులు 5
నెయ్యి 50 gms


ముందుగా మినప్పప్పును ఖాళీ బాణలిలో కమ్మని వాసన వచ్చేవరకు నిదానంగా
వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.పంచదార ఏలకులు కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు మినప్పప్పు పొడి, పంచదార పొడి రెండింటిటిని బాగా కలపాలి. కొద్ది కొద్దిగా
తీసుకుని కరిగించిన నెయ్యి పోసి ఉండలుగా కట్టి పెట్టుకోవాలి. ఇవి చాల పుష్టికరమైనవి.
మినుములతో కూడా చేస్తారు.

Thursday, November 16, 2006

పూతరేకులు
















బియ్యం పిండి 100 gm
పంచదార 250 gm
నెయ్యి 100 gm

ఈ పూతరేకులు చేయాలంటే చాల నేర్పు ఓర్పు కావాలి.చేయుటకు ప్రత్యేకమైన
కుండఉంటుంది. బియ్యపు పిండిని కూడా నలక పడితే కనపడేటంత మెత్తగా
రుబ్బాలి.కుండను బోర్లించి లొపలి భాగంలో మంట పెట్టాలి. పైభాగంలో నెయ్యి రాచి
ఒక చేతి గుడ్డంత వెడల్పుగుడ్డను పలుచగా కలిపిన పిండిలో ముంచి కాలే కుండ
మీద పరిచి వెంటనే లాగాలి. అప్పుడు పలుచని రేకులాగా లేస్తుంది. వాటినే
పూతరేకులంటారు. ఇంత కష్టపడేకంటేపూతరేకులు మాత్రమే దొరుకుతాయి.
అవి తెచ్చుకుని నెయ్యి పంచదార వేసి చుట్టుకుంటే చాలా త్వరగా తయారవుతాయి.
పంచదారను మెత్తగ పొడి చెసి పెట్టుకోవాలి. మంచి నెయ్యి కరగపెట్టాలి. ఒక గుడ్డ
పరిచి రెండు రేకులు పరిచి నెయ్యి పంచదార చల్లి మడిచి చాప చుట్టాలుగా చేసి
పెట్టుకోవాలి. ఇవి తినటానికి చాలా రుచిగా కరిగిపోయేలా ఉంటాయి.

Monday, November 13, 2006

దధ్యోధజనం













బియ్యం 100 gm
పెరుగు 100 ml
పాలు 100 ml
ఎండుమిర్చి 4
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినపప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
అల్లం ముక్క 1"
కరివేపాకు 2 రెబ్బలు
నెయ్యి 2 tbsp


ముందుగా అన్నం మెత్తగా వండి గరిటతో మెత్తగా చేసి, తగినంత ఉప్పు కలిపి
పెట్టుకోవాలి. పాలు పెరుగు బాగా కలిపి ఉంచుకోవాలి. నెయ్యి వేడి చేసి ఇంగువ
వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక మినపప్పు,శనగపప్పు,
కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి కాస్త వేపి పెరుగు మిశ్రమంలో
కలపాలి. ఇప్పుడు ఈ పెరుగును అన్నంలో వేసి బాగ కలిపి తినేయడమే.
మొత్తం పెరుగుతో చేస్తె పుల్లగా అవుతుంది. పాలు పెరుగు కలిపి చేస్తే కమ్మగా
ఉంటుంది రోజంతా. నిమ్మకాయ ఊరగాయతో కలిపి తింటె అదుర్స్.

నిమ్మకాయ పులిహొర













బియ్యం 100 gm
నిమ్మకాయలు 2
పసుపు 1/4tsp
ఎండు మిర్చి 4
ఆవాలు 1/4tsp
జీలకర్ర 1/4tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
ఉప్పు తగినంత
కరివేపాకు 1 రెబ్బ
ఇంగువ చిటికెడు

అన్నం వండి చల్లార్చి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. తర్వాత ఆవాలు,
జీలకర్ర, ఎండుమిర్చి,వేసి చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పసుపు
వేసి కాస్త వేపి దింపి నిమ్మకాయ పిండాలి. ఈ పోపునంతా అన్నంలో వేసి తగినంత
ఉప్పు వేసి మొత్తం బాగా కలిపి ఓ రెండు నిమిషాల తర్వాత తినేయడమే.

పులిహొర















బియ్యం 100 gm
చింతపండు 50 gm
పసుపు 1 tsp
ఎండు మిర్చి 4
ఆవాలు 1 tsp
జీలకర్ర 1/2tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 2 tsp
వేరుశన గుళ్ళు 1/4 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 4 tbsp
ఉప్పు తగినంత

అన్నం వండి చల్లార్చి పెట్టాలి. చింతపండును అర కప్పు నీళ్ళు పోసి నాన పెట్టి చిక్కటి
పులుసు తీసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఇంగువ, ఆవాలు,
జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు,
కరివేపాకు పసుపు వేసి వేయించి పులుసు పోయాలి. తగినంత ఉప్పు కొద్దిగా బెల్లం
కాని చక్కెర కాని వేసి మరిగించాలి. పులుసు చిక్కబడి నూనె తేలగానే దింపేయాలి.
కాస్త చల్లారిన తర్వాత అన్నంలో వేసి బాగా కలిపి ఓ పది నిమిషాలు అలాగే మూత
పెట్టి ఉంచాలి. ఇప్పుడు తినడానికి రేడి. పులుసు ఎక్కువ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుని
కావల్సినప్పుడు అన్నం వండి కలుపు కోవచ్చు.

Friday, November 03, 2006

బ్రెడ్ పకోడి

బ్రెడ్ స్లైసులు 8
బంగాళ దుంప (ఉడికించినది) 1
శనగపిండి 1 కప్పు
పచ్చిమిర్చి 2
కొత్తిమిర 1 tbsp
కరివేపాకు 1 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
వంట సోడా చిటికెడు
పసుపు చిటికెడు
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
నూనె వేయించడానికి


ముందుగా బాణలిలో ఒక స్పూను నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడాక

కరివేపాకు,తరిగిన పచ్చిమిర్చి,పసుపు వేసి కొద్దిగా వేపి ఉడికించిన బంగాళ దుంపను

పొడి పొడిగ చిదిమి అందులో వేసి తగినంత ఉప్పు,కొత్తిమిర వేసి రెండు నిమిషాలు

వేయించాలి.శనగపిండిలో ఉప్పు,కారం పొడి,వంట సోడా వేసి గరిటజారుగా కలిపి

ఉంచాలి. ఒక బ్రెడ్ స్లైసును తీసుకుని దానిపై కొద్దిగా బంగాళదుంప మిశ్రమాన్ని పరిచి

ఇంకో స్లైసును దానిపై పెట్టి అతుకునేట్టట్టుగా కొద్దిగా వత్తి నాలుగు చతురస్రాలుగా

కట్ చేయాలి. ఇప్పుడు ఒక్కో ముక్కను శనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో

ఎర్రగా కాల్చాలి.ఇవి గ్రీన్ సాస్ కాని టొమాటో సాస్ కాని నంజుకుని తింటే బావుంటాయి

పక్కనే వేడి కాఫీ కాని టీ కాని ఉండాలి సుమా.

బ్రెడ్ పిజ్జా

ఉల్లిపాయ 1
టొమాటో 1
పచ్చిమిర్చి 2
కారట్(తురిమినది) 1 tbsp
కాప్సికం 1 tbsp
కొత్తిమిర 2 tbsp
ఉప్మా రవ్వ 1 కప్పు
పాలు 1/2 కప్పు
ఉప్పు తగినంత
టోమాటో సాస్ 1 tsp
చిల్లీ సాస్ 3 tbsp
చీజ్ 50 gm
నూనె 5 tbsp



పైన వస్తువులన్నీ కలిపి పెట్టుకోవాలి చీజ్,చిల్లీసాస్ తప్ప. ఇప్పుడు ఒక్కో బ్రెడ్

స్లైసుపై చిల్లీ సాస్ పూసి రెండు స్పూనుల మిశ్రమాన్ని పెట్టి సమానంగ పరిచి

తురిమిన చీజ్ చల్లి పెనంపై కొద్దిగా నూనె కాని వెన్న కాని వేసి రెండు వైపులా

కాల్చాలి.లేదా ఒవన్లో కాని కాలిస్తె సరి చీజ్ కరిగేవరకు.

బ్రెడ్ బజ్జీలు

బ్రెడ్ 8 స్లైసులు
శనగ పిండి 2 కప్పులు
ఉప్పు తగినంత
కారం పొడి 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
వంట సోడా చిటికెడు
గరం మసాల పొడి 1/2tsp
వాము లేదా జీలకర్ర 1/2tsp
నూనె వేయించడానికి



ముందుగా బ్రెడ్ ముక్కలను త్రికోణాలుగ కట్ చేసి పెట్టుకోవాలి.వాటిని టోస్టర్లో

కాని పెనంపై కాని కాస్త గట్టిపడేటట్టు కాల్చి పెట్టుకోవాలి. గిన్నెలో శనగపిండి

,ఉప్పు,కారం పొడి,అల్లం వెల్లుల్లి ముద్ద, వాము లేదా జీలకర్ర,గరం మసాలా పొడి

,వంట సోడా కలిపి నీళ్ళు పోసి గరిటజారుగా కలిపి ఓ పది నిమిషాలు ఉంచాలి.

నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ ముక్కను పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా

వేయించాలి .వేడి వేడిగా సాస్ కాని ఆవకాయ కాని నంజుకుని తింటె అదిరిపోతుంది.

బ్రెడ్ మంచూరియా

బ్రెడ్ 6 స్లైసులు
మైదా 1/2 కప్పు
కార్న్ ఫ్లోర్ 1 tbsp
అల్లం వెల్లుల్లి ముద్ద 2 tsp
మిరియాల పొడి 1 tsp
కారం పొడి 1/2 tsp
ఉప్పు తగినంత
సోయా సాస్ 1/2 tsp
అజినొమొటో చిటికెడు
పచ్చిమిర్చి 1
ఉల్లి పొరక 1/4 కప్పు



బ్రెడ్ అంచులు తీసేయాలి. ఒక్కో స్లైసును నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోండి.

ఇప్పుడు మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు,సగం అల్లం వెల్లుల్లి ముద్ద,కారం పొడి కలిపి

కొద్దిగా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టాలి.ఈ మిశ్రమం మరీ చిక్కగా

కాకుండా,మరీ పలుచగా కాకుండా ఉండాలి. పొయ్యి మీద నూనె వేడి చేసి

ఈ బ్రెడ్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి. అలా

అన్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి.తర్వాత ఒక బాణలిలో రెండు స్పూనుల

నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లి పొరక,

పచ్చిమిర్చి ముక్కలు, వేసి బాగా వేపాలి. ఇప్పుడు అర కప్పు నీళ్ళలో 1 స్పూను

కార్న్ ఫ్లోర్,అజినొమొటొ,సొయా సాస్,మిరియాల పొడి వేసి కలిపి పోపులో వేసి

మరిగించాలి.ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి ఓ నిమిషం ఉడికించి దించేయండి.

ఈ వంటకం పొడి పొడిగా కావాలనుకుంటే కారంఫ్లోర్ మిశ్రమం వేయకూడదు.

అజినొమొటొ, సొయాసాస్,మిరియాల పొడి వేసి బాగ వేపి బ్రెడ్ ముక్కలు వేసి

కలిపి ఓ నిమిషం తర్వాత దించితే సరి.

బ్రెడ్ ఉప్మా

బ్రెడ్ 8 స్లైసులు
ఉల్లిపాయలు 1
టొమాటో 2
పచ్చిమిర్చి 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/4 tsp
కరివేపాకు 1 tbsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp


ముందుగా బ్రెడ్ ను చిన్న చదరపు ముక్కలుగ చేసి పెట్టుకోవాలి.కావాలంటె

ఈ ముక్కలను నూనెలో కాని టోస్టర్లో కాని ఎర్రగా కాల్చి పెట్టుకోవచ్చు.ఉల్లిపాయలు,

పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి

ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు,కరివేపాకు వేసి కొద్దిగా వేపి తరిగిన ఉల్లిపాయలు,

పచ్చిమిర్చి,పసుపు వేసి వేపాలి.ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్ని

బాగా కలిపి మూత పెట్టాలి.ఓ మూడు నిమిషాల తర్వాత కొత్తిమిర చల్లి దించేయండి.

ఇది చాల తొందరగా అయ్యే టిఫిన్.