Featured Posts
ఉగాది పచ్చడి

చింతపండు, బెల్లం,మామిడి తురుము, కొబ్బరి తురుము, సోంపు,జీలకర్ర పొడులు,వేప పువ్వు, సారపప్పు
ఇది తెలంగాణా స్టైల్ పచ్చడి.చింతపండు , బెల్లం విడివిడిగా నీళ్ళలో నానబెట్టాలి. చింతపండు పులుసు పలుచగా తీసుకుని. బెల్లం నీరు కలపాలి. ఇందులో మామిడి తురుము, కొబ్బరి తురుము, ఒకో స్పూను జీలకర్ర, సోంపు పొడులు, వేపపువ్వు, సారపప్పు కలిపి కడిగిన
కొత్త కుండలో వేసి పెట్టాలి. రెండు గంటల తర్వాత చల్లగా గ్లాసులో పోసుకుని షర్బత్లా తాగాలి.
వేరే వాళ్ళు చిక్కగా చేసుకుంటారు.
పెసర బొబ్బట్లు

పెసరపప్పు 250 gm
పంచదార 250 gm
రవ్వ 250 gm
మైదా 100 gm
యాలకుల పొడి 1 tsp
నెయ్యి అరకప్పు
పెసరపప్పును శుభ్రపరచుకొని గంట సేపు నీటిలో నాననివ్వాలి. నానిన పప్పును
మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పప్పును ఆవిరిపై ఉడికించుకోవాలి. ఉడికిన
ముద్దను చల్లార్చి చిదిమి పొడి చేసుకుని పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగ
పాకం పట్టి పెసరపప్పు పిండిని పకంలో చేర్చాలి. ఉడుకుతుండగా అందులో కొంచెం
నెయ్యి,యాలకుల పొడి వేసి గట్టి పడేవరకు వుంచాలి. తర్వత దించేయాలి.
చల్లారాక చిన్న చిన్న వుండలు చేసుకుని వుంచుకోవాలి.మైదా, రవ్వ కలిపి
నీళ్ళు పోసి పూరిపిండిలా తడిపి గంట నాననివ్వాలి. ఒక పాలిధిన్ పేపర్కు నూనె
రాసి పూరిపిండిని చిన్న వుండలుగా చేసి వెడల్పుగా వత్తుకుని మధ్యలో రవ్వ
ముద్దను పెట్టి అంచులు మూసి నూనె చేతితో చపాతీలా వత్తుకుని వేడి పెనంపై
నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చుకోవాలి. ఇవి వేడిగా తింటే ఒక రకం రుచిగానూ,
చల్లారాక తింటే ఒక రుచిగాను ఉంటాయి. ఎలా ఇష్టం ఉంటే అలా తినవచ్చు.
రవ్వ బొబ్బట్ట్లు

బొంబాయిరవ్వ 250 gm
పంచదార 250 gm
మైదాపిండి 250 gm
యాలకుల పొడి 1 tsp
నెయ్యి 50 gm
నూనె అర కప్పు
ముందుగా మందపాటి గిన్నెలో రెండు స్పూనుల నెయ్యి వేడి చేసి బొంబాయిరవ్వ పోసి
దోరగా వేయించుకోవాలి. మరో గిన్నెలో పంచదార యాలకులపొడి వేసి నీళ్ళు పోసి
మరిగిన తర్వాత రవ్వ పోసి ఉండకట్టకుండా నెయ్యేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి.
చక్కగా మగ్గిన తర్వాత దింపేయాలి. మైదాపిండిలో కొంచెం నెయ్యిగాని నూనె గాని
వేసి కొంచెం నీళ్ళు పోసి పూరిపిండిలా కలుపుకొని గంటసేపు నాననివ్వాలి. తర్వాత
పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకుని వెడల్పుగా వత్తుకుని మధ్యలో రవ్వ పూర్ణం
పెట్టి అంచులు మూసి పాలకవరుపై నూనె వేసి వెడల్పుగా పూరీల్లా వత్తుకుని వేడి
పెనంపై నెయ్యి వేస్తు నిదానంగా దోరగా కాల్చుకోవాలి. ఎక్కువ వేపితే
కరకరలాడతాయి. ఇవి మెత్తగా ఉండాలి.
నువ్వు బొబ్బట్టు

నువ్వులు 250 gm
బెల్లం 250 gm
మైదాపిండి 250 gm
ఎండుకొబ్బరిపొడి అరకప్పు
యాలకుల పొడి 1 gm
నూనె అరకప్పు
నెయ్యి అరకప్పు
ముందుగా నువ్వులను శుభ్రపరచుకొని దోరగా వేయించుకోవాలి. పొడి చేసుకున్న బెల్లం,
నువ్వులు, కొబ్బరిపొడి కలిపి మెత్తగా దంచుకొని చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి.
మైదాపిండిలో కొంచెం నూనె, నీళ్ళు పోసి పూరిపిండిలా కలిపి రెండుగంటలు నాననివ్వాలి.
మైదాపిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని నూనె చేత్తో వెడల్పుగా వత్తుకొని మధ్యలో
నువ్వుల ఉండ పెట్టి అంచులు మూసేసి, చపాతీలా వత్తుకుని వేడి పెనంపై నెయ్యి వేస్తూ
కాల్చుకోవాలి.
కొబ్బరి బొబ్బట్టు

పచ్చి కొబ్బరి తురుము 250 gm
బెల్లం 250 gm
మైదాపిండి 250 gm
నూనె అర కప్పు
నెయ్యి అరకప్పు
యాలకులపొడి 1 tsp
కొబ్బరితురుము, పొడి చేసుకున్న బెల్లం కలిపి కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడకనీయాలి.
మొత్తం ఉడికి గట్టిపడ్డాక యాలకులపొడి రెండు స్పూనుల నెయ్యి వేసి కలిపి చిన చిన్న
వుండలు చేసుకోవాలి. మైదాపిండిలో కొంచెం నూనె నీళ్ళు పోసి పూరి పిండిలా కలిపి
రెండుగంటలు నాననివ్వాలి. తరువాత ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని నూనె
చేతితో వెడల్పు చేసుకుని మధ్యలో పూర్ణం వుండ పెట్టి అంచులు మడిచి బొబ్బట్టులా
వత్తుకుని వేడెక్కిన పెనంపై వేసి నేయ్యి వేస్తు రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
శనగపప్పు బొబ్బట్లు

శనగపప్పు 500 gm
బెల్లం 500 gm
మైదాపిండి 250 gm
నూనె అర కప్పు
నెయ్యి అరకప్పు
యలకుల పొడి 1 tsp
సోంఫు పొడి 3 tsp
శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. తర్వాత నీళ్ళు
వార్చి పప్పును బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బాలి.చివరలో యాలకులు,సోంఫు పొడులు
కలపాలి.ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.తరువాత మైదాపిండిలో
కొంచెం నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి.ఈ పిండిముద్దను కనీసం ఒక గంట అయినా
నాననీయాలి. నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చేతితో వెడల్పు
చేసి మధ్యలో పూర్ణం ఉండను పెట్టి చుట్టూ అంచులు మడిచి నూనె చెయ్యి చేసుకుని ప్లాస్టిక్
కాగితం మీద పూర్ణం బయటకు రాకుండా వెడల్పుగా చపాతీలా ఒత్తుకోవాలి. పొయ్యి మీద
పెనం వేడి చేసి ఈ బొబ్బట్టును నేతితో రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకుని
తీసుకున్న వేడి వేడి బొబ్బట్టుపై కాస్త వెన్న వేసుకు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న
అనుభూతి కలుగుతుందా చూడండి.
వేడి వేసవి - చల్లని పానీయాలు

ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి.
ఇది వేసవికాలం. అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు చెమట రూపంలో బయటకి వస్తుంది.
పెరిగిన ఉష్ణోగ్రత నుండి సహసిద్ధమైన విధానంలో మనల్ని మనం కాపాడుకునేందుకు నీరు
ఎక్కువగా త్రాగాలి.నీటితో పాటు ఇతర ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం చాలా అవసరం.
* మజ్జిగ,నిమ్మరసం, కొబ్బరినీరు, పండ్లరసాలు, రాగిజావ, బార్లీ నీరు మొదలైనవి
తరచుగా తీసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవిలో తలెత్తే
సమస్యలను నివారించవచ్చు వడదెబ్బ తగులకుండా తగిన శక్తిని పెంపొందించుకోవచ్చు.
కొద్దిపాటి శ్రద్ధ, ఆసక్తి వుంటే నిమిషాల వ్యవధిలో రుచికరమైన ద్రవపదార్థాలు తయరు
చేసి ఇంటిల్లిపాది ఆనందంగా సేవించవచ్చు.
* గుప్పెడు బార్లీ గింజలను నాలుగు గ్లాసుల నీళ్ళతో కలిపి కుక్కర్లో ఉడికించండి. వడ
కట్టి కొద్దిగా బెల్లం,ఉప్పు చేర్చి బార్లీ నీరు త్రాగండి.
* రాగిపిండిని రెండు స్పూన్లు తీసుకుని ఒక గ్లాసు నీళ్ళలో కలపండి. ఈ మిశ్రమాన్ని
రెండు గ్లాసుల మరుగుతున్న నీటిలో పోసి ఉండలు కట్టకుండా కలపండి. ఉడికిన
రాగిజావలో కొద్దిగా పాలు,బెల్లం కలిపి హాయిగా తాగండి. అభిరుచిని బట్టి మజ్జిగలో
కూడా కలిపి సేవించవచ్చు.
* సగ్గుబియ్యాన్ని నీళ్ళలో ఉడికించండి. పాలు, పంచదార లేక బెల్లం ఏలకులపొడి
వేసి తాగండి.
* పుచ్చకాయ ముక్కలలోనుండి గింజలు తీసేసి గ్రైండర్లో రసం చేసి చల్లచల్లగా తాగండి.
* కరివేపాకు, కొత్తిమిర, అల్లం సన్నగా తరిగి మజ్జిగలో కలపండి.కొద్దిగా ఉప్పు,
పచ్చిమిరప కాయలు కూడా కలపండి. మధురమైన రుచిలో వుండే మజ్జిగ సేవించి
వేసవి తాపము నుండి ఉపశమనం పొందండి.
* పది బాదం పప్పులను ఆరు గంటలపాటు నీటిలో నానబెట్టండి. తొక్క తీసి నీళ్ళతో
కలిపి మిక్సిలో వేయండి. ఆ బాదంపాలతో కొద్దిగా తేనె కలిపి అద్భుతమైన రుచితో
కూడిన పానీయం చేసుకోండి.
* బాగా పండిన 3 జామపండ్లను ముక్కలుగా కోసి మిక్సీలో వేయండి.రెందు గ్లాసుల
నీళ్ళు, ఒక స్పూను తేనె, కొద్దిగా నిమ్మరసం కలపండి.
* ఆరు ఖర్జూరపండ్లను గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తగిన నీరు పోసి
మిక్సీలో వేయండి. కావాలంటే పాలు కూడా కలపొచ్చు. నిమ్మరసం, ఏలకులపొడి,
బెల్లం కలిపి తీసుకోండి.
* నాలుగు అరటిపండ్లు, రెందు గ్లాసుల నీరు మిక్సీలో వేసి తిప్పండి. కొద్దిగా బెల్లం,
ఏలకుల పొడి కలిపి సేవించండి.
* రెండు క్యారట్లు, ఒక బీట్రూట్ ముక్కలుగా చేసి నీరు కలిపి మిక్సీలో వేయండి.
రసాన్ని వడకట్టి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తగండి.
* 2 మామిడిపండ్లు రసం తీసి పంచదార, పాలు, ఏలకులపొడి కలిపి తాగండి.
కృత్రిమంగా తయారుచేసిన జ్యూసులకంటే సహజసిద్ధమైన విధానంలో ఇంట్లో
పరిశుభ్రంగా చేసిన ద్రవాలు ద్రవపదార్థాలు, తాగడం ఎంతో మేలు.
200....ఆవడలు
మినప్పప్పు శుభ్రం చేసి కడిగి నాలుగు గంటలు నీటిలో నానబెట్టాలి. తరువాత
ఫ్రూట్ సలాడ్
అరటిపళ్ళు 4
పళ్ళన్నీ చిన్న ముక్కలుగా కోసి నిమ్మరసం కలిపి చక్కెర, కండెన్స్డ్ మిల్క్
షాహీ టుక్రా
బ్రెడ్ 8
బ్రెడ్ను నిలువుగా కాని త్రికోణాకారంగా కాని కట్ చేసి ఎర్రగా వేయించుకోవాలి.
పనీర్ సాండ్విచ్
ఉల్లిపాయ 1
టొమాటో 1
పనీర్ 100 gm
కారం 1 tsp
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
వెన్న 50 tsp
ఉల్లిపాయ,టొమాటో,కొత్తిమిర సన్నగా తరిగి,తురిమిన పనీరు,ఉప్పు,కారం
వేసి బాగ కలిపి వెన్న రాసిన బ్రెడ్ ముక్కలపై చెంచాడు పెట్టి వెడల్పుగా
సర్ది టోస్టర్లో కాని,ఓవెన్లో కాని,పెనంపై కాని రెండువైపులా వేయించాలి.దీనిని
సాస్తో పట్టు బట్టడమే.
పనీర్ బఠానీ కుర్మా
పనీర్ 200 gm
ఉల్లిపాయలు,టొమాటోలు,అల్లం వెల్లుల్లి,పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరి
పనీర్ టిక్కా
పనీర్ 200 gm
పనీర్ పకోడీ
పనీర్ 200 gm
ముందుగా శెనగపిండిలో ఉప్పు, కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమిర,
పాలక్ పనీర్
పనీర్ 200 gm
తరిగిన పాలకూరను ఐదునిమిషాలు నీటిలో ఉడికించాలి.చల్లారిన తర్వాత
మిర్చీ పనీర్
పనీర్ 250 tsp
ముందుగా వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
షాహీ పనీర్
పనీర్ 250 gm
పనీర్ను అంగుళం ముక్కలుగా కోసి వేడి నూనెలో బంగారు వర్ణం వచ్చేవరకు
రొయ్యలు చుక్కకూర
రొయ్యలు 500 gm
బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి,
రొయ్యలు టోమాటో కూర
రొయ్యలు 250 gm
టోమాటోలు మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి సన్నగా
రొయ్యలు కుర్మా
రొయ్యలు 250 gm
కొబ్బరి, గసగసాలు కలిపి నూరి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు
రొయ్యల ఇగురు
పచ్చి రొయ్యలు 250 gm
రొయ్యలు వలిచి,శుభ్రంగా కడిగి వుంచుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి
లివర్ సొయకూరతో
లివర్ 500 gm
బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి,అల్లం వెల్లుల్లి,
లివర్ కూర
లివర్(కార్జం) 500 gm
ఉల్లిపాయలు 3
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 2 tsp
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
కొబ్బరి పొడి 3 tsp
ధనియాల పొడి 3 tsp
గరం మసాలా 1 tsp
కొత్తిమిర 3 tsp
నూనె 4 tbsp
లివర్ను కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలు ఎర్రగా వేయించాలి.పచ్చిమిర్చి,కరివేపాకు,పసుపు,కారం,అల్లం
వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి కార్జం ముక్కలు,ఉప్పు వేసి తడి పోయేవరకు
వేయించాలి.ఇప్పుడు గ్లాసుడు నీళ్ళూ పోసి కలియబెట్టి ఉడికించాలి. ముక్కలు
ఉడికిన తర్వాత కొబ్బరిపొడి,గరం మసాలా,కొత్తిమిర కలిపి మరో ఐదు
నిమిషాలు ఉడికించి,నూనె తేలగానే దింపేయాలి.
పిట్ట కూర
కౌజు పిట్టలు 2
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 1 tsp
కొబ్బరి పొడి 2 tbsp
జీడిపప్పు 6
ధనియాలు 2 tbsp
లవంగాలు 5
యాలకులు 3
దాల్చిన చెక్క 4
జీలకర్ర 1/2 tsp
గసగసాలు 2 tsp
పసుపు 1/2 tsp
ఉప్పు తగినంత
కారం 1 tsp
కొత్తిమిర 1 కట్ట
కరివేపాకు 2 tsp
నూనె 4 tbsp
ధనియాలు,లవంగాలు, చెక్క, యాలకులు కొంచెం వేయించి మెత్తగా పొడి చేయాలి.
పిట్టను బాగు చేసి కాల్చి, పసుపు వేసి కడిగి ముక్కలు కోయాలి. అల్లం వెల్లుల్లి,
కొబ్బరి,గసగసాలు,జీడిపప్పు కలిపి మెత్తగా ముద్దగా నూరాలి. మాంసం ముక్కల్లో ఉల్లిపాయలు,ఉప్పు,కారం,పసుపు,అల్లం ముద్ద,రెండు గ్లాసుల నీళ్ళు పోసి మెత్తగా
ఉడికించాలి.బాణలిలో నూనె వేడి చేసి పోపు గింజలు,కరివేపాకు వేసి వేయించి
వుడికించిన పిట్టకూర వేసి బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్న మసాలా ,
కొత్తిమిర చల్లి రెండు నిమిషాలు వేయించి దింపేయాలి.
మటన్ చాప్స్
మటన్ చాప్స్ 500 gm
ఉల్లిపాయలు 3
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
ఎండుమిర్చి3
మిరియాలు 1 tsp
కొత్తిమిర 1 కట్ట
నూనె 5 tbsp
అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి కలిపి ముద్దగా నూరాలి.చాప్స్ కడిగి శుభ్రంగా
వుంచాలి.వీటికి నూరిన మసాలా ముద్ద,ఉప్పు,పసుపు బాగా పట్టించాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఈ చాప్సుకు సరిపడా నీళ్ళు పోసి వుడికించాలి.
వేరే బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా
వేయించాలి.వుడికించిన చాప్స్,మిరియాల పొడి,కొత్తిమిర కలిపి వేసి
వేయించి దింపాలి.
సొరచేప వేపుడు
పీతల పులుసు
పీతలను కాళ్ళు తీసేసి కావలసిన సైజులో కోసుకుని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు,
పీతల వేపుడు
పీతలు శుభ్రపరచి మీక కావలసిన సైజులో ముక్కలు చేసుకుని కడిగి పెట్టుకోవాలి.
వేట తలకాయ పులుసు
తలకాయ కూర మాంసం 500 gm
ఉల్లిపాయలు 2
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ధనియాల పొడి 2 tbsp
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 1 tsp
చింతపండు పులుసు 1/2 కప్పు
గరం మసాలా 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ముందుగా మాంసం ముక్కలు అర కప్పు నీళ్ళు,కొద్దిగా పసుపు వేసి కుక్కర్లో
రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.లేకుంటే పదినిమిషాలు మామూలుగా
ఉడికించాలి. ఇప్పుడు దానిలోని ఎముకలన్ని మెల్లిగా తీసేయాలి.వేరే బాణలిలో
నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి,పసుపు,
కారం ధనియాల పొడి వేసి కొద్దిగా వేపి, మాంసం ముక్కలు,ఉప్పు కరివేపాకు
వేసి కలియబెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత పులుసు అర కప్పు
నీళ్ళు పోసి ఉడికించి నూనె తేలాక గరం మసాలా కొత్తిమిర చల్లి దింపేయాలి.
మాంసం మెదడు కూర
మెదడు 1
ముందుగా మెదడును శుభ్రం చేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి
మాంసం చుక్కకూర
మాంసం 250 gm
చుక్కకూర 5 కట్టలు
ఉల్లిపాయలు1
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 1 tsp
కొబ్బరిపొడి 3 tsp
ధనియాల పొడి 1 tsp
గసగసాలు 1 tsp
గరం మసాల 1 tsp
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
కొబ్బరి గసగసాలు పొడి చేసి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు
ఎర్రగా వేయించి పసుపు,కారం,అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు,
తగినంత ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక రెండు
కప్పులు నీరు పోసి ముక్కలు మెత్తగా ఉడికేవరకు ఉంచాలి. ఇప్పుడు శుభ్రం చేసి
తరిగిన చుక్కకూర,కొబ్బరి ముద్ద,గరం మసాలా అందులో కలిపి నూనె తేలేవరకు
ఉడికించి దింపేయాలి.

































