Featured Posts
కొర్రలతో పాయసం
కొర్రలు అంటే అంధ్రా రాయలసీమ దిక్కు ఎక్కువగా పండుతుంది. అది బియ్యంతో
సమానం. అన్నం లాగే వండుకుంటారు.ఇడ్లీ, దోశ కూడా చేసుకుంటారు. ఇందులో
చక్కెర శాతం చాల తక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా
ఉపయోగకారి. వరి అన్నం బదులు కొర్రన్నం చాలా మంచిది. దీనిని ఇంగ్లీషులొ
foxtail millet అంటారు. పెద్దల అమావాస్య రోజు కొర్రలతో పాయసం చేసి
పెద్దలకు నైవేద్యం పెడతారు..
కొర్రలు 1 కప్పు
పాలు 500 ml
చక్కెర
లేదా బెల్లం 100 gm
యాలకులు 4
నెయ్యి 2 tsp
ముందుగా కొర్రలను శుభ్రం చేసుకుని గ్లాసుడు నీళ్ళు పోసి గంటసేపు నాననివ్వాలి.
తరువాత వాటిని మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. పాలు పోసి అవి మరుగుతుండగా
చక్కెర కాని బెల్లం కాని వేసి చిక్కపడేవరకు ఉడికించి నెయ్యి, యాలకులపొడి వేసి
కలిపి దింపేయాలి.
తేనీరు - T - వండర్స్

జీవించడానికి ప్రతి ఒక్కరికి కావాలి నీరు. బ్రతకడానికి అవారం లేకపోయినా అత్యధిక
జనాభా తాగేది టీ. టీ కున్న శక్తిని తెలుగువారే బాగా గుర్తించినట్టున్నారు. అందుకే
"తేనీరు" అని పేరు పెట్టారు. అన్ని పానీయాలు నీటిని ఉపయోగించి చేసేవే అయినా
ఒక్క టీకి మాత్రమే నీరు కలిపి వచ్చేలా పేరు పెట్టి నీటి తర్వాత టీనే ముఖ్యపానీయమని
తెలియచెప్పారు.మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే టీదుకాణంలేని
ప్రదేశం ఉండదు. చిన్న గ్రామం మొదలు మహా పట్టాణాలవరకు ప్రతిచోటా టీ బడ్డీలు
ఉంటాయి. టీ లేకుండా పార్టీలుండవు. నలుగురిని ఒకచోట పిలవాలంటే మనం ఏర్పాటు
చేసేది టీ పార్టీ.సమావేశాల్లో, క్రికెట్ పోటీలలో కూడా మధ్యలో "టీ" బ్రేక్ ఉంటుంది.
అతిథులు ఇంటికి వచ్చినప్పుడు చేసే సత్కారంలో "టీ" తప్పనిసరి.
బ్లాక్ టీ: పాలు లేకుండా చేసేది బ్లాక్ టీ. ఇది రక్తం గడ్దకట్టనీయదు. తద్వారా గుండె
ఏది ఏమైనా దేవతలందరూ తాగేది అమృతమైతే భూలోకంలో ప్రజలందరూ తాగే అమృతం టీ.
వందవ టపా .. సగ్గుబియ్యం పాయసం
సగ్గుబియ్యం 100 gm
ముందుగా సగ్గుబియ్యం అరగంట నానబెట్టాలి.తరువాత అదే నీళ్ళలోపాలు
అరిసెలు
వడ
ముందుగా మినప్పప్పును రెండుగంటలపాటు నానబెట్టి, మిక్సీలో పచ్చిమిర్చితో
చక్ర పొంగలి
ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వాలి. తర్వాత మెత్తగా ఉడికించాలి.
పొంగలి
ముందుగా బియ్యం, పెసరపప్పు శుభ్రపరచి కడిగి అరగంట నానబెట్టాలి. నూనె లేదా
పాలతో మైసూర్ పాక్
పంచదార 150 gm
పంచదార శనగపిండి, పాలని ఒక గిన్నెలో ఉండలు లేకుండా కలపాలి. అందులో అర
కాజూ మైసూర్ పాక్
ముందుగా జీడిపప్పును బరకగా పొడి చేసుకోవాలి. దానిని శనగపిండిలో కలపాలి.
కాలిఫ్లవర్ కూర
క్యాబేజీ బఠానీల కూర
ముందుగా క్యాబేజీని, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెడల్పాటి
చోలె బటూర
ఇప్పుడు పొంగిన చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని పూరీలాగా వత్తుకుని
గ్రుడ్ల ఖుర్మా
ముందుగా గ్రుడ్లను ఉడకబెట్టి పెంకు తీసి చాకుతో గాట్లు పెట్టి ఉంచాలి. నూనె వేడి
గ్రుడ్ల కూర
రొయ్యల కూర
ముందుగా వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
చికెన్ మసాలా కూర
చికెన్ 1 kg
ఉల్లిపాయ 3
అల్లం వెల్లుల్లి 2 tsp
కారం పొడి 2 tsp
పసుపు 1/2 tsp
ధనియాల పొడి 3 tbsp
గరం మసాలా 1 tsp
టొమాటో 200 gm
కొత్తిమీర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ముందుగా టోమాటోలు,ఉల్లిపాయలు ముక్కలుగ కోసి విడివిడిగా రుబ్బుకోవాలి.
చికెన్ కూర
చేప వేపుడు
తందూరీ చికెన్
ముందుగా చికెన్ ను శుబ్రంగా కడిగి, చర్మం తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి,
స్వీట్ కార్న్ పాయసం
మొక్కజొన్నగింజలు 2 కప్పులు
బెల్లం 1 కప్పు
యాలకులు 4
బియ్యప్పిండి 2 tsp
పాలు 1/2 లీటరు
ముందుగా రెండు కప్పుల నీళ్ళలో మొక్కజొన్నగింజలు చిటికెడు ఉప్పు కలిపి
మెత్తగా ఉడికించాలి.ఇప్పుడు బెల్లం చేర్చి పూర్తిగా కరిగాక పాలు పోసి ఉడికించాలి.
తరువాత బియ్యంపిండిలో కాసిన్ని నీళ్ళు కలిపి ఉడుకుతున్న పాయసంలో వేసి
కలిపి చిక్కబడ్డాక యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.
మొక్కజొన్న వడ
లేత మొక్కజొన్నగింజలు 2 కప్పులు
పచ్చిమిర్చి 4
అల్లం 1 ' ముక్క
కొత్తిమిర 1/4 కప్పు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
మొక్కజొన్నగింజలు, అల్లం పచ్చిమిర్చి కలిపి బరకగా రుబ్బి ఉప్పు, సన్నగా తరిగిన
కొత్తిమిర కలిపి వేడి నూనెలో వడల్లాగా వత్తుకుని ఎర్రగా కాల్చి వేడి మీద తినాలి.
కార్న్ ఇన్ కోన్
లేత మొక్కజొన్నలు 2 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
టోమాటో ముక్కలు 1 కప్పు
పచ్చిమిర్చి 2
కొత్తిమిర 1/4 కప్పు
చాట్ మసాలా 1 tsp
ఐస్ క్రీం కోన్ లు 5
ఉప్పు తగినంత
పైన చెప్పిన వస్తువులన్ని కలిపి కోన్లలో నింపి పైన కాస్త కొత్తిమిర చల్లి
అప్పటికప్పుడే తినవచ్చు. కావాలంటే కాస్త నిమ్మరసం కూడా చేర్చుకోవచ్చు.
బేబీ కార్న్ కూర
మొక్కజొన్న పలావ్ , కుర్మా
బాస్మతి బియ్యం 3 కప్పులు
అన్ని రక్కల కూరగాయముక్కలు 1/2 కప్పు
లేత మొక్కజొన్న గింజలు 1/2 కప్పు
బిరియాని ఆకు 2
దాల్చిన చెక్క 1 " ముక్క
యాలకులు 4
లవంగాలు 5
షాజీరా 1 tsp
ఉల్లిపాయ 1 చిన్నది
పుదీనా 2 tsp
పచ్చిమిర్చి 2
పసుపు చిటికెడు
నెయ్యి 2 tsp
నూనె 2 tsp
ఉప్పు తగినంత
కుర్మా కోసం
ఉల్లిపాయలు 2
ధనియాల పొడి 1 tsp
జీలకర్ర పొడి 1 tsp
కారం పొడి 1 tsp
పంచదార 1/4 tsp
మీగడ 2 tsp
నెయ్యి లేదా నూనె 2 tsp
ఉప్పు తగినంత
ముద్దగా నూరాల్సినవి
వెల్లుల్లి 3రెక్కలు
అల్లం ముక్క 1/2"
యాలకులు 2
జీడిపప్పు 2 tsp
గసగసాలు 1 tsp
బియ్యం కడిగి పదినిమిషాలు నాననివ్వాలి. నూనె,నెయ్యి కలిపి వేడి చేసి బిరియాని
ఆకు, గరం మసాల వస్తువులు వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిర్చి,పుదీన వేసి కాస్త వేపాలి. ఇప్పుడు కూరగాయలు, మొక్కజొన్న గింజలు
వేసి వేపి 6 కప్పుల నీళ్ళు పోసి తగినత ఉప్పు వేసి మరగనివ్వాలి. కడిగిన బియ్యం
నీళ్ళు ఒంపేసి అందులో వేయాలి.మొత్తం ఉడికినతర్వాత దింపేయాలి.
కుర్మా
నెయ్యి వేడి చేసి ఉల్లిపాయలను బంగారు రంగువరకు వేయించాలి నూరిన ముద్ద,
ధనియాలపొడి, జీలకర్ర పొడి, కారం తగినంత ఉప్పు కలిపి సన్న సెగపై నెయ్యి
మసాలా నుండి విడిపడేవరకు ఉడికించాలి కొంచం నీరు పోసి కలిపి దించి మీగడా
వేసి కలిపి కొత్తిమిర చల్లి ఈ పలావ్ తొ వడ్డించాలి.
పెరుగు చట్నీ
పెరుగు 1 కప్పు
ఉల్లిపాయ 1
కొత్తిమిర 2 tsp
ప చ్చిమిర్చి 1
ఉప్పు తగినంత
ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని చాల చిన్న ముక్కలుగా తరిగి పెరుగులో వేసి తరిగిన
కొత్తిమిర, ఉప్పు వేసి బాగా కలిపి ఈ పలావ్ తో కలిపి వడ్డించాలి.
మొక్కజొన్న ఉప్మా
బొంబాయి రవ్వ 2 కప్పులు
లేత మొక్కజొన్నగింజలు 1 కప్పు
పచ్చిమిర్చి 4
క్యారట్ ముక్కలు 1/4 కప్పు
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
తరిగిన ఉల్లిపాయ 1
అల్లం 1' ముక్క
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 2 tbsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp
నెయ్యి 2 tsp
ముందుగా నెయ్యి వేడి చేసి రవ్వ బాగా వేయించుకోవాలి.బాణలిలో
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాకా పప్పులు
వేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు, క్యారట్
ముక్కలు వేసి కాస్త వేపాలి. ఇప్పుడు మొక్కజొన్న గింజలు కూడా
వేసి కొద్దిగా వేపి అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
తర్వాత మూడు కప్పుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరగ
నివ్వాలి. నీళ్ళు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ మెల్లిగా
పోస్తూ ఉండలు కట్టకుండా కలుపాలి. ఇది సన్నటి మంటపై
ఉడకనిచ్చి కొత్తిమిర నిమ్మరసం చల్లి దించేయాలి.
ఇది చాల రుచిగా ఉంటుంది.
మొక్క జొన్న దోసె
బియ్యం 1 కప్పు
ఉప్పు తగినంత
ముందుగా బియ్యం, మొక్కజొన్నలు బాగా కడిగి నలుగు గంటలు
మొక్కజొన్న సమోసా
మొక్క జొన్న సలాడ్
కొబ్బరి పచ్చడి
పచ్చి కొబ్బరి 1 కప్పు
ఇవి అన్నీ కలిపి మెత్తగా రుబ్బి పోపు పెట్టుకోవాలి.
పుదీనా పచ్చడి
పుదీనా 1 కప్పు
పుదీనా కడిగి ఆరబెట్టుకోవాలి.చింతపండు కొద్ది నీళ్లలో నానబెట్టాలి. ఒక స్పూను
ఉసిరి ఆవకాయ
ఉసిరికాయలు 1 kg
ముందుగా ఉసిరికాయలను కడిగి తుడిచి వేడి నూనెలో కాస్త మెత్తపడేవరకు
కొత్తిమిర పచ్చడి
కొత్తిమిర 1 కప్పు
కొత్తిమిర కడిగి సన్నగా తరిగి ఒక చెంచాడు నూనెలో కొద్దిగా వేపి
నిమ్మ ఊరగాయ
ఎగ్ డ్రాప్ సూపు
ముందుగా కూరగాయలను చాల చిన్న ముక్కలుగా తరిగి మూడుగ్లాసుల నీరు
కార్న్ సూపు
ముందుగా కూరగాయలు చిన్న ముక్కలుగా తరిగి వెన్నలో కొద్దిగా వేపి
నూడిల్స్ సూపు
ముందుగా నూనె వేడి చేసి తరిగిన కూరగాయలు కొద్దిగా వేయించి మూడు
క్యారట్ సూపు
క్యారట్ను ముక్కలుగా కోసి రెండుగ్లాసులు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి.
మటన్ సూపు
పై పదార్తాలన్ని కలిపి నీళ్ళు పోసి కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చేవరకు
టొమాటో సూపు
ముందుగా టోమాటోలను కప్పుడు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి,చల్లారిన
యాలకులు

భారతదేశం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది. అందులో అన్నిటికన్నా ఖరీదయినది కుంకుమపువ్వు. తర్వాతి స్థానం యాలకులది. వీటి జన్మస్థలం భారతదేశం. భారతదేశంలో మసాలాద్రవ్యాల రారాణిగా యాలకులను పేర్కొందురు.
యాలకులకు విశేష ఔషధగుణాలున్నాయి. జీర్ణవ్యవస్థకు మేలు చేసే లక్షణం వీటికి ఉంది. నోటి దుర్వాసన, అజీర్ణం, వాంతులకు విరుగుడుగా వాడతారు. పిత్తాశయం, పేగులో ఇబ్బందులకు, కడుపునొప్పి తగ్గడానికి ఉపకరిస్తాయి.యాలకులనూనె కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. తలతిరుగుడు వాంతులకు విరుగుడుగా పనిచేస్తుంది.దగ్గు, గొంతులోని భాధలకు ఉపశమన. పిల్లలకు వచ్చే కడుపునొప్పి అజీర్ణానికి వాముతో పాటు యాలకులు కలిపి వాడతారు.

యాలకుల సువాసన ఆహారపదార్థాలను బాగా తినేలా చేస్తాయి. అలా తిన్న ఆహారాన్ని యాలకులు త్వరగా జీర్ణం చేస్తాయి. ఆరోగ్యదాయకమైన యాలకుల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.యాలకుల మొక్క బెరడును తాజాగా తీసి నోటిలో వేసుకుని నమలితే కదిలిన పండ్లకు తిరిగి పట్టు వస్తుంది. దంతాలలో రక్తస్రావం ఆగిపోతుంది. బలపడతాయి. మొక్క బెరడుతో తీసిన కషాయం సైంధవలవణంతో కలిపి పుక్కిలిస్తే టాన్సిలైటిస్ తగ్గుతుంది.
మిర్చిఘాటు చాలా ఫేవరేటు
మిరపలో పలురకాల మేలు చేసే ఔషధ గుణాలున్నాయి. దీనిలోని
పరోటా
ముందుగా మైదాలో ఉప్పు కలిపి నీళ్ళతో చపాతీ పిండిలా కలిపి ఒక స్పూను
మసాలాపురీ
గోధుమపిండిలో నూనె తప్ప మిగతావన్ని కలిపి నీళ్ళతో చపాతీ పిండిలా
పుల్కాలు
గోధుమపిండిని ఉప్పు కలిపి జల్లించి నీళ్ళతో మృదువుగా తడిపి పెట్టుకోవాలి.
పూరీ
గోధుమపిండిలో ఉప్పు కలిపి జల్లించి నీళ్ళతో కలిపి పదినిమిషాలు పక్కన



























































